గిరిజనుల రిజర్వేషన్లపై కేసీఆర్ డ్రామాలాడుతున్నారని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె. లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంబిస్తూ . రిజర్వేషన్ల అమలుపై రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉందని తెలిపానారు. రాష్ట్రంలో అమలయ్యే జీవోలన్నింటికి కేంద్రం ఆమోదం ఉందా అని ప్రశ్నించారు.
ఎన్టీఆర్ హయాంలో ఒక్క జీవోతో రిజర్వేషన్లు పెంచారని లక్ష్మణ్ గుర్తు చేశారు. గిరిజనులకు 10 %రిజర్వేషన్లు జీవో తోనే అమలైతే 8 ఏళ్ల నుంచి జీవో ఎందుకు ఇవ్వలేదని కేసీఆర్ ని ప్రశ్నించారు. మునుగోడు ఎన్నికలు వస్తున్నాయనే గిరిజన రిజర్వేషన్ల అంశాన్ని కేసీఆర్ తెరపైకి తెచ్చారని, వారిని మోసం చేసేందుకు రిజర్వేషన్ల నాటకమని లక్ష్మణ్ ఆరోపించారు.
రిజర్వేషన్లను పెంచడమే కాకుండా దానిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే అని ఆయన వెల్లడించారు. లేకపోతే దీనిపై బీజేపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కేసీఆర్, కాంగ్రెస్ ఒక్కటేనని పేర్కొంటూ ఎన్ని అవినీతి పార్టీలు ఏకమైన ప్రజలు మోదీ వైపునే ఉన్నారని తెలిపారు. కేసీఆర్ ఎన్ని బంధులు తీసుకువచ్చిన రాష్ట్రంలో టీఆర్ఎస్ బంద్ కావడం ఖాయమని లక్ష్మణ్ భరోసా వ్యక్తం చేశారు.
8 ఏళ్లుగా అమలు చేయలేదే!
కాగా, ఎనిమిదేళ్లుగా సీఎం కేసీఆర్ గిరిజన రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేదని, ఇప్పుడే ఆ హామీ ఎందుకు గుర్తుకు వచ్చిందని మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఇన్ చార్జ్ మురళీధర్ రావు ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర లో దమ్మాయిగూడ జవహర్ నగర్ లో పాల్గొంటూ కుటుంబ, అవినీతి, మాఫియా రాజ్యాన్ని అంతమొందించాలంటే.. రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలని కోరారు.
More Stories
తెలంగాణాలో రెండంకెల సీట్లు.. కిషన్ రెడ్డి ధీమా
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి మాధవీలతపై కేసు నమోదు
డా. సునీత నర్రెడ్డికి అరుదైన గుర్తింపు