అంతరిక్షంలోకి మొట్టమొదటి మానవ సహిత టెస్ట్ ఫ్లయిట్ను ఈ ఏడాదే పంపించడం జరుగుతుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ మంగలవారం న్యూఢిల్లిలో ప్రకటించారు. కరోనా కారణంగా ఈ ప్రయోగం వాయిదా పడినట్లు ఆయన వెల్లడించారు.
భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా 2022 నాటికే ఈ యాత్రను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిందని చెప్పారు. రష్యా, భారత్లలో శిక్షణ పొందుతున్న వ్యోమగాములకు కొవిడ్ తీవ్ర ప్రతిబంధకమైందని పేర్కొన్నారు.
వచ్చే ఏడాది చేపట్టనున్న ఈ అంతరిక్షయాత్రలో స్త్రీ ఆకృతిలో తయారయ్యే రోబో “వ్యోమ్మిత్ర”ను అంతరిక్షానికి పంపడమౌతుందని మంత్రి తెలిపారు. ఈ మిషన్కు సంబంధించి నలుగురు పోరాట యోధులైన పైలట్లను వైమానిక దళం గుర్తించిందని, ఈ వ్యోమగాములు రష్యాలో శిక్షణ పొందుతున్నారని చెప్పారు.
రెండు కక్ష పరీక్షల ఫలితాల బట్టి దిగువ భూ కక్షకు ఇద్దరు వ్యోమగాములను 2024లో ఇస్రో పంపిస్తుందని మంత్రి వివరించారు. 2018 స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ గగన్యాన్ మిషన్ ప్రకటన చేశారు. 75 సంవత్సరాల స్వాతంత్రం సందర్భంగా అంతరిక్షంలో ముగ్గురు సభ్యుల బృందం ఐదు నుంచి ఏడు రోజులు గడుపుతారని ప్రధాని ప్రకటించారు. గగన్యాన్కు కేంద్రం రూ. 10,000 కోట్లు కేటాయించింది.
More Stories
ఒక్క సీటు కోసం ఉగ్రవాద సంస్థకు కాంగ్రెస్ మద్దతు
ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా
ఇండియా కూటమి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు