రాష్ట్ర హైకోర్టు మొట్టికాయలు వేసినా మూడు రాజధానులు అంటూ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తున్నా, రాజధాని విషయంలో నిర్ణయం తీసుకోవలసింది రాష్ట్ర ప్రభుత్వమే అని, అందులో తమ ప్రమేయం ఉండబోదని కేంద్రం స్పష్టం చేస్తున్నా, విభజన చట్టం ప్రకారం కేంద్రం ఇచ్చే నిధులు కేవలం ఒకే రాజధానికి అని కేంద్రం స్పష్టం చేసింది.
తద్వారా మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రమేయం ఉండబోదని స్పష్టం చేసినట్లయింది. రాష్ట్ర విభజన అంశాలపై ఈనెల 27న రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ సమావేశం కానుంది. విభజన చట్టం ప్రకారం రాజధానికి కేంద్రం సహకారంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కొత్త రాజధానికి నిధులు అని మాత్రమే కేంద్ర హోంశాఖ అజెండాలో తెలిపింది. మూడు రాజధానులపై అజెండాలో ప్రస్తావనే లేదు.
పదే పదే మూడు రాజధానులని చెబుతున్న జగన్మోహన్ రెడ్డికి కేంద్రం షాకిచ్చిందనే చెప్పవచ్చు. గతంలో ఏపీ హైకోర్టు రాజధానిగా అమరావతే ఉంటుందని తీర్పు ఇచ్చినప్పటికీ, ఈ నెలలో ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులకు సంబంధించి బిల్లు పెడతామని చెబుతన్న సీఎం జగన్కు కేంద్రం షాక్ ఇచ్చిన్నట్లయింది.
ఈ నెల 27న కేంద్రం జరుపనున్న సమావేశంలో విభజన అంశాలకు సంబంధించి అన్ని అంశాలపై చర్చించనున్నారు. విభజన చట్టం ప్రకారం రాజధానికి కేంద్ర సహకారంపై ఈ భేటీలో చర్చించబోతున్నామంటూ కేంద్ర హోంశాఖ ఏపీ, తెలంగాణకు పంపించిన అజెండాలో పేర్కొంది. రాజధాని నగరం నుంచి ర్యాపిడ్ రైల్ అనుసంధానం అంశాన్ని కూడా హోం శాఖ పొందుపరిచింది.
ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కారం, విభజన కావాల్సిన అంశాల్లో షెడ్యూల్ 9లో ఉన్న ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు, షెడ్యూల్ 10లో ఉన్న రాష్ట్ర సంస్థల విభజన, విభజన చట్టంలో పేర్కొనని సంస్థల పంపిణీ, ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్, సింగరేణి కాలరీస్, ఏపీ హెవీ మెషినరీ ఇంజనీరింగ్, నగదు, బ్యాంకు బ్యాలెన్సులు వంటి అంశాలను అజెండాలో చేర్చారు.
అదే విధంగా, విదేశీ సాయంతో చేపట్టిన ప్రాజక్టులపై తీసుకున్న అప్పుల విభజన. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలకు ఇవ్వాల్సిన నిధులు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది.
ఈ సమావేశంకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర ఆర్ధిక శాఖలోని రెవెన్యూ, ఎక్స్పెండీచర్, ఆర్ధిక సర్వీసులు, ఎకనమిక్ అఫైర్స్ కార్యదర్శులు, ఆహార, విద్య, వ్యవసాయ కార్యదర్శులు, పెట్రోలియం, సహజ వాయువులు కార్యదర్శి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, రైల్వే బోర్డు ఛైర్మన్లు హాజరు కావాలని కేంద్ర హోం శాఖ డైరక్టర్ పార్థసారధి సర్య్కూలర్ విడుదల చేశారు.
More Stories
వేముల రోహిత్ దళిత్ కాదు…. కేసు మూసివేత
ధర్మవరంలో బిజెపి కార్యకర్తలలపై రెచ్చిపోయిన వైసీపీ మూకలు
దుమారం రేపుతున్న బెంగాల్ గవర్నర్ పై లైంగిక ఆరోపణలు