ఆరేళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉన్న నేరాల విషయంలో ఫోరెన్సిక్ దర్యాప్తును చట్టబద్ధం, తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్షంగా పెట్టుకున్నట్టు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా వెల్లడించారు. ఫోరెన్సిక్ సైన్స్ లో భారత్ గ్లోబల్ హబ్గా మారుతుందని తెలిపారు.
దేశంలో నేర న్యాయ వ్యవస్థను, ఫోరెన్సిక్ సైన్స్ దర్యాప్తును మిళితం చేయాలని భావిస్తున్నట్లు అమిత్ షా చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల కంటే అధికంగా మన దేశంలో నేర నిరూపణల శాతాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
గుజరాత్ గాంధీనగర్ లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీ మొదటి స్నాతకోత్సవంలో ఆదివారం షా ప్రసంగీస్తూ ప్రతి జిల్లాలో ఫోరెన్సిక్ మొబైల్ ఇన్వెస్టిగేషన్ సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందనిరు. దర్యాప్తులో స్వతంత్రత, నిష్పక్షపాత వైఖరి ఉండేలా చట్టబద్ధమైన నిర్మాణాన్ని రూపొందిస్తుందని తెలిపారు.
తెలిపా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ), ఎవిడెన్స్ యాక్ట్లో మార్పులు తీసుకురానున్నట్లు వెల్లడించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ చట్టాలను ఎవరూ భారతీయ దృష్టికోణంలో చూడడం లేదని విచారం వ్యక్తం చేశారు.
ఈ చట్టాలను స్వతంత్ర భారత దృష్టి కోణం నుంచి పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ క్రమం లోనే నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నాం అని అమిత్షా తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎఫ్ఎస్ యులో డీఎన్ఏ ఫోరెన్సిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఇన్వెస్టిగేటివ్, ఫోరెన్సిక్ సైకాలజీలో ఏర్పాటు చేసిన మూడు ఎక్స్లెన్స్ కేంద్రాలను మంత్రి ప్రారంభించారు.
ఈ మూడు సెంటర్లు విద్య, శిక్షణతోపాటు పరిశోధన, అభివృద్ధికి ముఖ్య కేంద్రాలుగా మారతాయని పేర్కొన్నారు. అంతకు ముందు వెయ్యి మంది విద్యార్థులకు మాస్టర్స్ డిగ్రీలు ప్రదానం చేశారు. దేశాభివృద్ధి కోసం కృషి చేయాలని వారికి పిలుపునిచ్చారు.
More Stories
ఎంపీగా గెలుపొందితే బాలీవుడ్కు కంగనా వీడ్కోలు
కేజ్రీవాల్ నిరసన పిలుపుతో ఢిల్లీలో ఉద్రిక్తత
ఆరు నెలల్లో భారత్ లో భాగం కానున్న ఆక్రమిత కాశ్మీర్