24న హర్యానా, పంజాబ్ లలో ప్రధాని మోదీ పర్యటన 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 24న హరియాణా, పంజాబ్ లలో  రెండు ముఖ్యమైన ఆరోగ్య సదుపాయాలను ప్రారంభించి, దేశ ప్రజలకు
అంకితం చేస్తారు. ఉదయం సుమారు 11 గంటలకు హరియాణాలోని ఫరీదాబాద్ లో అమృత హాస్పిటల్ ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు.  ఆ తరువాత, ఆయన మొహాలీకి బయలుదేరి వెళ్లి,  2.15 గంటలకు  సాహిబ్ జాదా అజీత్ సింహ్ నగర్ జిల్లా (మొహాలీ) లోని న్యూ చండీగఢ్ పరిధి లో గల ముల్లాన్ పుర్ లో ‘హోమీ భాభా కేన్సర్ హాస్పిటల్ ఎండ్ రిసర్చ్ సెంటర్’ ను దేశ ప్రజలకు అంకితం చేస్తారు.

ఫరీదాబాద్ లోని అమృత హాస్పిటల్ ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తున్నందు వల్ల నేశనల్ కేపిటల్ రీజియన్ (ఎన్ సిఆర్)లో వైద్య సంబంధి ఆధునిక మౌలిక సదుపాయాల లభ్యతకు ఒక ఉత్తేజం లభించనుంది. మాత అమృతానందమయి మఠం నిర్వహించే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో 2600 పడకల ను ఏర్పాటు చేశారు. 

దాదాపు గా రూ 6,000 కోట్ల అంచనా వ్యయం తో నిర్మాణాధీనం లో ఉన్న ఈ ఆసుపత్రి ఫరీదాబాద్ ప్రజలకు, యావత్తు ఎన్ సిఆర్ ప్రాంతం ప్రజలకు అత్యధునాతనమైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను అందిస్తుంది.

పంజాబ్, పంజాబ్ చుట్టుపక్కల రాష్ట్రాలకు, ఇంకా కేంద్ర పాలిత ప్రాంతాల నివాసుల కు ప్రపంచ శ్రేణి కేన్సర్ సంరక్షణను అందించే ప్రయత్నంలో భాగంగా ‘హోమీ భాభా కేన్సర్ హాస్పిటల్ ఎండ్ రిసర్చ్ సెంటర్’ ను సాహిబ్ జాదా అజీత్ సింహ్ నగర్ జిల్లా (మొహాలీ) లోని న్యూ చండీగఢ్ పరిధిలో గల ముల్లాన్ పుర్ లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. 

ఈ ఆసుపత్రిని రూ 660 కోట్ల రూపాయల కు పైగా వ్యయంతో భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఒక ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్ అయిన టాటా మెమోరియల్ సెంటర్ నిర్మించింది. 300 పథకాలతో, ఇన్ పేశెంట్ లకు మూడో స్థాయికి చెందిన అభివృద్ధిపరచిన ఆరోగ్య సంరక్షణ సేవలను, చికిత్సలను అందించేటటువంటి ఆసుపత్రిగా ఉండబోతోంది.

దీనిలో అన్ని  రకాలైన కేన్సర్ కు సంబంధించిన చికిత్సల కోసం ఆధునిక సదుపాయాలు నెలకొన్నాయి. ఇక్కడ శస్త్ర వైద్యం/చికిత్స, ఎక్స్ రే చికిత్స, మెడికల్ ఆంకాలజి- కీమో థెరపి, ఇమ్యూనో థెరపి, ఎముక మజ్జ మార్పిడి వంటి సౌకర్యాలు అందుబాటు లో ఉంటాయి. ఈ ఆసుపత్రి యావత్తు ప్రాంతం లోకేన్సర్ సంరక్షణ, చికిత్సల కు ‘కేంద్రం’గా పని చేయనుంది. కాగా సంగ్ రూర్ లోని 100 పడకల ఆసుపత్రి ఈ కేంద్రాని కి ‘శాఖ’ గా విధుల ను నిర్వర్తించనుంది.