ఆజాదీ కా అమృత్ మహాత్సవ్లో భాగంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతీయులందరూ త్రివర్ణ పతాకాన్ని ఇంటికి తీసుకెళ్లేలా ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంకు దేశ ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది.
కోట్లాది మంది ప్రజలు ప్రధాని పిలుపుకు స్పందిస్తూ తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగరవేయడమే కాకుండా, ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాతో సెల్ఫీ దిగి దాదాపు 6 కోట్ల మంది www.harghartiranga.com వె బ్ సైట్లో అప్ లోడ్ చేశారు. మువ్వన్నెలతో సెల్ఫీలు తీసుకున్న వారు తమ ఫొటోలను వెబ్ సైట్లో ఇంకా అప్ లోడ్ చేస్తున్నారు.\
జాతీయ భావనను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వివిధ మంత్రిత్వ శాఖలు విస్తృతంగా పనిచేస్తూ ప్రజలను ఈ మహోద్యమంలో భాగస్వాములను చేయడంలో ప్రోత్సహించాయి. స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో క్షేత్రస్థాయిలో కృషి చేశాయి.
స్వాతంత్ర్య పోరాట ఘట్టాలను స్పృశిస్తూ.. ప్రజల్లో దేశభక్తి, ఐకమత్యాన్ని పెంపొందించే లక్ష్యంతో అధికారులు సమాజంలోని అన్ని వర్గాల వారిని కలుపుకొని వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతం కావడంపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు యావద్భారతం ఏకతాటిపైకి వచ్చిందని, భారతదేశంలోని వివిధ వర్గాల ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన చెప్పారు. భారతదేశ ఐకమత్యం, సమగ్రతపై ప్రజలకున్న సత్ సంకల్పానికి ఇదొక నిదర్శనమని కిషన్ రెడ్డి చెప్పారు. భారతదేశాన్ని ఉన్నతమైన స్థానంలో నిలపాలన్న ప్రజల వజ్ర సంకల్పానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
చలనమైంది.
More Stories
మణిపూర్ లో 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్
మణిపూర్లో మిలిటెంట్ల దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి
ఇక ఏడాదిలో రెండుసార్లు సీబీఎస్ఈ పరీక్షలు