కాశ్మీర్ లో నదిలో బస్ పడి ఆరుగురు జవాన్ల మృతి 

జమ్ముకశ్మీర్ లో పహల్గామ్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు జవాన్లు మృతి చెందారు. మరో 30 మంది సైనికులకు గాయాలయ్యాయి.

 వెంటనే స్పందించిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని శ్రీనగర్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అమర్‌నాథ్‌ యాత్ర విధుల కోసం ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌ సిబ్బందితో కూడిన బస్సు చందన్‌వారీ నుంచి పహల్గాంకు వెళ్తోంది. పహల్గాం ఫ్రిస్‌లాన్‌ రోడ్డు వద్దకు చేరుకోగానే ప్రమాదానికి గురైంది.

బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో అదుపు తప్పి.. లోయలో పడిపోయిందని ప్రమాదానికి గల కారణాలను వివరించారు అధికారులు.ప్రమాదం సమయంలో బస్సులో 39  మంది ఉన్నారు. వీరిలో 37 మంది ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు కాగా..మరో ఇద్దరు జమ్మూ కశ్మీర్ పోలీసులు. ఈ ప్రమాదంలో ఐటీబీపీ జవాన్లు ఆరుగురు మరణించారు. అమర్‌నాథ్ లో బందోబస్తు  విధులు నిర్వర్తించి అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు చందన్వారి నుంచి శ్రీనగర్ లోని పోలీస్ కంట్రోల్ రూమ్ కు వెళ్తుండగా నదిలో పడింది.