82 రోజులలో 1000 కి.మీల పాదయాత్రకు చేరుకున్న సంజయ్ 

తెలంగాణలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకోవడం, వారికి భరోసా ఇవ్వడంతోపాటు టీఆర్ఎస్ కుటుంబ అవినీతి, నియంత పాలనకు చరమగీతం పాడాలనే లక్ష్యంతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో వెయ్యి కి.మీల మైలు రాయిని అధిగమించారు. 
 
 అందుకు చిహ్నంగా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లెవద్ద స్టేజీ వద్ద స్థానిక పార్టీ కార్యకర్తలు ప్రత్యేకంగా ‘పైలాన్‘ను నిర్మించారు. సంజయ్ అక్కడికి చేరుకోని పైలాన్ ను ఆవిష్కరింఛారు. తమ జిల్లాలో సంజయ్ పాదయాత్ర వెయ్యి కి.మీల మార్క్ దాటడంతో స్థానిక నేతలు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. ఇప్పటికి 34 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టుముట్టింది. 
 
వెయ్యి బెలూన్లు ఎగరేయడంతోపాటు వెయ్యి షాట్స్ (బాణాసంచా) పేల్చారు. దీంతోపాటు డప్పు వాయిద్యాలతో, కార్యకర్తల న్రుత్యాలతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటికే రెండు విడతలు పూర్తి చేసిన సంజయ్ మూడో విధాత 83వ రోజున ఈ మార్క్ అధిగమించారు. 
మొదటి విడత పాదయాత్ర ఆగస్టు 28న పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమై అక్టోబర్ 2న హుస్నాబాద్ లో ముగిసింది. తొలివిడతలో మొత్తం 36 రోజుల పాటు పాదయాత్ర చేసి 438 కి.మీలు నడిచారు. 19 అసెంబ్లీలో 9 జిల్లాలు, 6 ఎంపీ సెగ్మెంట్లలో పాదయాత్ర చేశారు.
 
అట్లాగే రెండో విడత పాదయాత్రను బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న అలంపూర్ లోని జోగులాంబ అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభించి రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో మే 14న ముగించారు. మొత్తం 31 రోజుల పాటు పాదయాత్ర చేసిన సంజయ్ 3 ఎంపీ, 9 అసెంబ్లీ, 5 జిల్లాల మీదుగా 383 కి.మీలు నడిచారు. 
 
తాజాగా కొనసాగుతున్న మూడో విడత పాదయాత్ర ఆగస్టు 2న ప్రారంభమై నేటికీ 15 రోజులు. పైలాన్ ఆవిష్కరించే సమయానికి 183 కి.మీలు నడక పూర్తయింది. వెరసి పాలకుర్తి నియోజకవర్గంలోని వెయ్యి కి.మీల మైలు రాయిని దాటి 1001 కి.మీలోకి అడుగు పెట్టడం గమనార్హం.
 
 ఈ 82 రోజుల పాదయాత్రలో అనేక సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చారు. అన్ని వర్గాల ప్రజలను కలుసుకున్నారు. వివిధ సమస్యలపై వేలాది దరఖాస్తులను స్వీకరించారు. వేయి కి మీ పూర్తయిన సందర్భంగా సంజయ్ మొక్క నాటారు. 
మునుగోడులో కాషాయ జెండా ఎగురుతుంది

కాగా, మునుగోడులో కాషాయ జెండా ఎగురుతుందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కోవర్టు రాజకీయాలకు మునుగోడు ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాజగోపాల్‌రెడ్డి తెలంగాణఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రజలపై నమ్మకంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని తెలిపారు.

రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడుకు నిధులు విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ప్రాజెక్టులు ఏమయ్యాయి సీఎం కేసీఆర్ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మునిగిపోయే నావా అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

.బీజేపీలో ఈనెల 21న చేరేందుకు నిర్ణయించుకోవడం, అదేరోజు మునుగోడులో అమిత్‌షా సభ, భారీగా చేరికల నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో  రాజగోపాల్‌రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతీ మండలంలోని కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులతో భేటీ అవుతూ రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు.

తాను అమ్ముడు పోయినట్లు రుజువు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమని చెబుతూ అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని, రాష్ట్రంలో కుటుంబ పాలన అంతమొందించాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ, అమిత్‌షాతోనే సాధ్యమని స్పష్టం చేశారు. మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వనున్నారంటూ ఆయన ప్రచారం చేస్తున్నారు.