కర్ణాటకలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో తమ సారథి నూటికి నూరుశాతం ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాత్రమే అని బీజేపీ మరో మారు స్పష్టం చేసింది. ముఖ్యమంత్రిని మార్చబోతున్నారని అంటూ వస్తున్న కథనాలను తీవ్రంగా ఖండించింది.
బొమ్మై ”కీలుబొమ్మ ముఖ్యమంత్రి” అంటూ కాంగ్రెస్ పార్టీ నిరంతర గుప్పిస్తున్న విమర్శల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ బొమ్మైని తప్పించనున్నారంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వదంతుల్లో ఎంతమాత్రం నిజం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక పార్టీ ఇన్చార్జి అరుణ్ సింగ్ ఓ ప్రకటనలో తేల్చి చెప్పారు.
”కర్ణాటక రాష్ట్ర ఇన్చార్జిగా ఈ మాట చెబుతున్నాను. నా ప్రకటన నమ్మాలి. బొమ్మై నాయకత్వంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందనేది నూటికి నూరు పాళ్లు నిజం. బొమ్మై ఒక సాధారణమైన వ్యక్తి. రైతులు, యువకులు, ఎస్సీలు, ఎస్టీల కోసం ఎంతో చేస్తున్నారు. మేము (బీజేపీ) తిరిగి పూర్తి మెజారిటీతో గెలుస్తాం. 150 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ లక్ష్యాన్ని సాధిస్తాము కూడా” అని అరుణ్ సింగ్ భరోసా వ్యక్తం చేశారు.
చేతిలో ఏ అంశాలు లేనందున కాంగ్రెస్ నేతలు డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఏవేవో ప్రచారాలు చేస్తుంటారని, బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ వద్ద ఎలాంటి ఎజెండా లేదని, దాంతో సీఎంను మార్చేస్తారంటూ ప్రచారం సాగిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని ఆయన వివరణ ఇచ్చారు.
More Stories
భారత నేవీ చీఫ్గా దినేష్ త్రిపాఠి
మనం హిందువులమని గర్వంగా చెప్పుకోగలగాలి
పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోండి