వీసా అనుమతుల్లో జాప్యంకు బ్రిటిష్‌ హై కమిషనర్‌ క్షమాపణ

యూకే వీసా అనుమతుల్లో జాప్యం విషయమై భారత్‌లోని బ్రిటిష్‌ హై కమిషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌ క్షమాపణ కోరారు. వీసాలు అనుమతుల్లో జాప్యం గురించి వివరిస్తూ ట్విట్టర్‌ వేదికగా ఒక వీడియో సందేశాన్ని పంపించారు. ఈ మేరకు అలెక్స్‌ వీడియోలో యూకే వీసాల విషయమై ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ఎల్లిస్‌ ఇలా అన్నారు:

“మీలో చాలా మంది 15 రోజుల పని నిమిత్తం యూకేకి వెళ్లడానికి వీసాలను దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇలాంటి వాటికి సంబంధించి పలు వీసా అప్లికేషన్స్‌ వచ్చాయి. ఆయా వీసాల ప్రాసెసింగ్‌కి సమయం​ పడుతోంది. ఈ ఆలస్యం కారణంగా నష్టపోతున్న ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నాను”.

కరోనా  అనంతరం యూకే వీసాలకు డిమాండ్‌ పెరింగిందని, అంతేకాకుండా రష్యా – ఉక్రెయిన్‌ల యుద్ధం వల్ల కూడా ఈ డిమాండ్‌ మరింత ఎక్కువైందని ఆయన చెప్పారు. అలాగే ఈ వీసా ప్రక్రియ వేగవంతం చేసుకునేలా ప్రజలకు శిక్షణ ఇస్తామని తెలిపారు.  “మొదటగా చాలామంది ప్రాదాన్యత ఇచ్చే వీసా సేవనే మీకు అందుబాటులో ఉంచుతాం. అలాగే మీ వద్ద కావల్సిన సరైన పత్రాలు ఉన్నయని నిర్థింరించడంలో మాకు సహకరించండి. అలాగే మీ వీసా సురక్షితంగా ఉండే వరకు మీ విమాన టిక్కెట్‌కు కట్టుబడి ఉండొద్దు” అని సూచించారు.

యూకే వీసాలు పరిమితి గడువులోగా మంజూరయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆయన హామీ ఇచ్చారు.  కేవలం సందర్శకుల వీసాలు జారీ చేయడానికే ప్రస్తుతం ఆరు వారాల సమయం పడుతుందని చెప్పారు.  కొన్ని రకాల వీసా అప్లికేషన్లకు మూడు వారాలకు పైగా పట్టొచ్చని తెలిపారు.  సాధ్యమైనంత త్వరగా ఈ ఈ వీసాలు జారీ చేసేలా తాము కృషి చేస్తున్నామని వారించారు.