సిఎస్‌ఐఆర్‌ తొలి మహిళా డైరెక్టర్‌ జనరల్‌గా కలైసెల్వి

దేశంలో సుప్రసిద్ధ శాస్త్రేయ, పరిశోధనా వేదిక శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలిడైరెక్టర్ జనరల్‌గా సీనియర్ సైంటిస్ట్ నల్లతంబి కలైసెల్వి నియమితులయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఏప్రిల్‌లో పదవీ విరమణ చేసిన శేఖర్ మండే స్థానంలో ఆమె నియమితులయ్యారు. సీఎస్ఐఆర్ మన దేశంలోని 38 పరిశోధన సంస్థల కన్సార్షియం.

శేఖర్ మండే పదవీ విరమణ చేసిన తర్వాత బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్ కార్యదర్శి రాజేశ్ గోఖలేకు సీఎస్ఐఆర్ అదనపు బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. తాజాగా సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన నల్లతంబి కలైసెల్వి నీయమిస్తులయ్యారు. 

లిథియం అయాన్‌ బ్యాటరీల రంగంలో ఎనలేని కృషి చేసిన ఆమె ప్రస్తుతం తమిళనాడులోని కరైకుడిలోని సిఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ ఎలక్ట్రోకెమికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కి డైరెక్టర్‌గా ఉన్నారు. 25 సంవత్సరాలకు పైగా ఆమె ఎలక్ట్రోకెమికల్‌ పవర్‌ సిస్టమ్స్‌పై దృష్టిసారించారు. 

ఆమె సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తారు.  కలైసెల్వి సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ పదవీ కాలం రెండేళ్ళు. ఆమె ఈ పదవీ బాధ్యతలను చేపట్టిన తేదీ నుంచి రెండేళ్ళు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు, ఈ రెండిటిలో ఏది ముందు అయితే ఆ తేదీ వరకు ఆమె ఈ పదవిని నిర్వహించవచ్చు. 

సీఎస్ఐఆర్‌లో ఎంట్రీ లెవెల్ సైంటిస్ట్‌గా ఆమె కెరీర్ ప్రారంభమైంది. నల్లతంబి కలైసెల్వి తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా, అంబసముద్రం అనే చిన్న పట్టణంలో జన్మించారు. ఆమె తమిళ మాధ్యమంలో చదివారు. తాను తమిళంలో చదవడం వల్ల కళాశాలలో సైన్స్ భావనలను అర్థం చేసుకోగలిగానని ఆమె చెప్తూ ఉంటారు. ఆమె 125 పరిశోధన పత్రాలను సమర్పించారు. ఆరు పేటెంట్లను పొందారు.