సాధారణంగా వెళ్లుతూ ఉన్నట్లుగా ఉంటూనే దీని నుంచి భారత్ కు చెందిన పూర్తి స్థాయి రక్షణ సామర్థాలను, స్థితిగతులను అంచనావేసుకునేందుకు, రికార్డు చేసుకుని ముందుకు సాగేందుకు వీలేర్పడుతుంది. ఆ మేరకు తరువాత చైనా తన సైనిక సామర్థతను పెంచుకునేందుకు దీనిని వాడుకోవచ్చునని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
చైనాకు చెందిన ఈ నౌకను శ్రీలంక అనుమతించడంపై భారత్ ఆందోళనగా ఉంది. శ్రీలంక ప్రస్తుతం ఎదుర్కొంటోన్న ఆర్ధిక సంక్షోభం నుంచి కాపాడేందుకు చేయాల్సినంత చేస్తున్నా ఆ దేశం భారత్కు ఈ విషయంలో సహకరించలేకపోవచ్చని సమాచారం. ఈ నౌక వస్తున్నది శ్రీలంక ఆధీనం నుంచి చైనా పరమైన హంబన్ తోట ఓడరేవుకు కావడంతో శ్రీలంక ప్రభుత్వం నిస్సహాయతను వ్యక్తం చేసే అవకాశం ఉంది.
ఇది అణ్వాయుధేతర నౌక కాబట్టి తమ రేవు పట్టణానికి దీనిని అనుమతిస్తున్నామని శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. అయితే హిందూ మహాసముద్రంపై పూర్తిస్థాయి పర్యవేక్షణకు, నౌకాయాన ఆధిపత్యానికి దీనిని పంపిస్తున్నామని కూడా చైనా తెలిపిందని లంక రక్షణ మంత్రిత్వ శాఖ మీడియా ప్రతినిధి కల్నల్ నళిన్ హెరాత్ తెలిపారు.
చైనా నౌక సోమవారం పోర్టుకు వచ్చే అంశంపై కేబినెట్ చర్చించినట్లు శ్రీలంక ప్రభుత్వ ప్రతినిధి బందులా గుణవర్ధెన చెప్పారు. ‘తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న తరుణంలో భారత్, చైనాలు మాకు సాయం అందించాయి.’ అని పేర్కొన్నారు. అయితే, చైనా వల్లే దేశంలో పరిస్థితులు దిగజారాయనే వాదనలు వినిపిస్తున్న తరుణంలో ప్రభుత్వ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ చైనా నౌక దగ్గరి దారులలో వెంటనే హిందూ మహా సముద్రంలోకి వస్తుంది. ఎక్కువగా భారతీయ తీర ప్రాంతాలపై నిఘా పెడుతూనే వెళ్లుతుంది. ఆ తరువాత ఇది లంక పోర్టులో ఎంతకాలం తిష్టవేస్తే అంతకాలం భారతదేశానికి పలు రకాల భద్రతా సవాళ్లు ఏర్పడుతాయని అనుమానిస్తున్నారు. ప్రస్తుత అంశంపై జాతీయ భద్రతా సంస్థ ఇంటెలిజెన్స్ వర్గాలతో క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.
More Stories
అధికారంలోకి వస్తే ఎలక్టోరల్ బాండ్స్ని మళ్లీ తీసుకొస్తాం
త్వరలో భారత్లోకి ఎయిర్ట్యాక్సీలు
తొలి దశలో 62.37 శాతం మాత్రమే పోలింగ్