ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో దేశంలో కార్ల ఎగుమతులు 26 శాతం పెరిగాయి. లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతులు జోరందుకున్నట్లు సియామ్ డేటా వెల్లడించింది. కరోనా మహమ్మారి ప్రభావంతో కిందటేడాది ఇదే క్వార్టర్తో పోలిస్తే ఎగుమతులు ఊపందుకున్నాయని సియామ్ పేర్కొంది.
ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్యలో మన దేశం నుంచి 1,60,263 యూనిట్లు ఎగుమతి కాగా, అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్లో ఈ ఎగుమతులు 1,27,083 యూనిట్లు మాత్రమే!. ఏడాది కాలానికి చూస్తే కార్ల ఎగుమతులు ఏకంగా 88 శాతం ఎక్కువై 1,04,400 యూనిట్లకు చేరినట్లు పేర్కొంది.
ఇదే కాలంలో యుటిలిటీ వెహికల్స్ ఎగుమతులు 18 శాతం వృద్ధితో 55,547 యూనిట్లకు చేరాయని సియామ్ వివరించింది. ఇటీవలి కాలంలో లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల ఆర్ధిక వ్యవస్థలు మెరుగు పడుతుండటంతో మన దేశం నుంచి ఆ దేశాలకు కార్ల ఎగుమతులు పెరుగుతున్నాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ చెప్పారు.
ఎగుమతులలోనూ మారుతి సుజుకి టాప్ ప్లేస్లో నిలుస్తుండగా, హ్యుందాయ్ రెండో ప్లేస్లోను, కియా మూడో ప్లేస్లోనూ నిలిచాయి. మారుతి తన కార్లను లాటిన్ అమెరికా, ఏసియాన్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతి చేస్తోంది. బాలెనో, డిజైర్, స్విఫ్ట్, ఎస్–ప్రెస్సో, బ్రెజా మోడల్స్ ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి.
More Stories
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
కవిత బెయిల్ పిటిషన్పై మే 2న తీర్పు
కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ