మహంకాళి అమ్మవారికి కిషన్ రెడ్డి బోనం

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో ఆలయానికి వచ్చిన ఆయన  అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని కిషన్ రెడ్డి తెలిపారు . 
 
ఆదివారం ఉదయం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉజ్జయినీ మహంకాళి బోనాలు ప్రారంభమయ్యాయి.  కిషన్ రెడ్డికి ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికి..ఆశీర్వచనం చేశారు.  ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై దయ చూపాలని అమ్మవారిని కోరుకున్నట్లు  తెలిపారు. తెలంగాణ ప్రజలకు, యావత్తు హిందు సమాజానికి ఆయన బోనాల శుభాకాంక్షలు చెప్పారు.
గొల్కోండలో బోనాలు ప్రారంభమయ్యాయని, అనేక సంవత్సరాలుగా బోనాలు నిర్వహించే సంప్రదాయంగా వస్తోందని చెబుతూ దేశంలో ఈ రకమైన పండుగ ఎక్కడా కనిపించదని తెలిపారు. ధనిక, పేద అనే తేడా లేకుండా ఈ బోనాలు నిర్వహిస్తున్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు.
అంటు వ్యాధులు రాకుండా ప్రజలు ఇబ్బందులు పడకుండా, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన కూడా ఉండాలని, కరోనా పూర్తిగా నయం కావాలని.. మానవత సమాజం విజయం సాధించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
బోనాల సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ నిర్వాహకులు కృషి చేస్తున్నారని కిషన్ రెడ్డి సతీమణి తెలిపారు. ఇవాళ ఉదయం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉజ్జయినీ మహంకాళి బోనాలు ప్రారంభమయ్యాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు.