ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కొన్నేళ్లుగా వరుసగా సత్తా చాటుతున్న ఏపీ మరోసారి బిజినెస్ ర్యాంకుల్లో సత్తా చాటుకుంది. బిజినెస్ రీఫార్మ్స్ యాక్షన్ ప్లాన్-2020లో ఏపీ అగ్రస్ధానంలో నిలిచింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ టాప్ అచివర్స్లో ఉన్న 7 రాష్ట్రాల వివరాలను ఢిల్లీలో ప్రకటించారు.
ఇందులో ఏపీ టాప్ ప్లేస్ లో ఉంది. పొరుగు రాష్ట్రం తెలంగాణకు నాలుగో స్ధానం దక్కింది. టాప్ అచివర్స్ లో ఏపీతో పాటు గుజరాత్, హర్యానా, కర్నాటక, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మొత్తం నాలుగు కేటగిరీల్లో రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చింది.
గతంలో ఎప్పుడూలేని విధంగా ఈసారి కొత్త విధానాలతో కేంద్రం ఈ ర్యాంకింగ్ ప్రక్రియను చేపట్టింది. 10,200 మంది పెట్టుబడిదారులు, వాటాదారుల నుండి ఫీడ్బ్యాక్ సేకరించబడింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 97.89శాతం స్కోర్ తో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది.
కాగా గుజరాత్ 97.77 శాతం, తమిళనాడు 96.97 శాతం, తెలంగాణ 94.86 శాతంతో నాల్గో స్థానంలో నిలిచాయి. ఇప్పటికే ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకుల్లో టాప్ లో ఉన్న ఏపీ ఇప్పుడు వ్యాపార సంస్కరణల ప్లాన్ అమలు చేస్తున్న రాష్ట్రాల జాబితాలోనూ టాప్ లో నిలవడం విశేషం. దీంతో ఏపీ ప్రభుత్వ వర్గాలు తాజా ఫీట్ పై సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
ఇక, అచివర్స్ లిస్టులో హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. అస్పిరర్స్ లిస్టులో అసోం, ఛత్తీస్గఢ్, గోవా, జార్ఖండ్, కేరళ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. మరోవైపు.. ఎమర్జింగ్ బిజినెస్ ఎకోసిస్టమ్స్ విభాగంలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిలిచాయి. వీటిలో ఢిల్లీ, పుదిచ్చేరి, త్రిపుర ప్రాంతాలు చోటు దక్కించుకున్నాయి.
More Stories
పదో తరగతి ఫలితాల్లో ఏలూరు బాలికకు మొదటి స్థానం
66 వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
పోస్టల్ బ్యాలెట్ కు 26 వరకు పొడిగింపు