అణ్వాయుధ సామర్థ్యం గల అగ్ని-4 క్షిపణి ప్రయోగం

కనీస నిరోధక సామర్థ్యాన్ని పునరుద్ఘాటిస్తూ భారతదేశం సోమవారం తన అణ్వాయుధ సామర్థ్యం గల అగ్ని-4 క్షిపణి  ప్రయోగ పరీక్షను నిర్వహించింది. అగ్ని , పృథ్వీ దేశం యొక్క రెండు ప్రధాన అణు క్షిపణులు.
“ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ అగ్ని-4  విజయవంతమైన శిక్షణ ప్రయోగం జూన్ 6న ఒడిశాలోని  అబ్దుల్ కలాం ద్వీపం నుండి సుమారు 19.30 గంటలకు [సాయంత్రం 7.30]కి నిర్వహించబడింది” అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

“విజయవంతమైన పరీక్ష వ్యూహాత్మక బలగాల కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించబడే సాధారణ వినియోగదారు శిక్షణా ప్రయోగాలలో భాగం” అని పేర్కొన్నది. 

“లాంచ్ అన్ని కార్యాచరణ పారామితులను మరియు సిస్టమ్ యొక్క విశ్వసనీయతను ధృవీకరించింది”. కాగా ఈ ప్రయోగం “విశ్వసనీయమైన కనీస నిరోధక సామర్థ్యాన్ని కలిగి ఉండాలనే భారతదేశ విధానాన్ని పునరుద్ఘాటిస్తుంది” అని మంత్రిత్వ శాఖ వివరించింది. 

అగ్ని-4 అనేది ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్,. దీని రేంజ్ 4,000 కి.మీ. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డి ఆర్ డి ఓ) దీనిని అభివృద్ధి చేసింది, ఇది 1,000-కిలోల పేలోడ్‌ను మోయగలదు.  900 కి.మీ. ఎత్తుకు వెళ్ళగలదు.