ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు పేల్చివేస్తాం… బెదిరించిన వ్యక్తి అరెస్ట్  

ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 6 ఆర్ఎస్ఎస్ కార్యాలయాలను బాంబులతో పేల్చివేస్తామని వాట్సాప్‌లో బెదిరింపు సందేశం వచ్చింది. లక్నో, ఉన్నవ్ నగరాల్లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయాలను బాంబులతో పేల్చివేస్తామని సోమవారం రాత్రి వాట్సాప్ లో ఓ వ్యక్తి బెదిరింపు మెసేజ్ పంపించారు.

ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాలను పేల్చివేస్తామని బెదిరిస్తూ జూన్ 6, సోమవారం వాట్యాప్ సందేశాలు పంపిన రాజ్ మహ్మద్ అనే వ్యక్తిని తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ ఇచ్చిన సమాచారం మేరకు తమిళనాడులోని పుదుకోడి జిల్లాకు చెందిన మహ్మద్‌ను రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. యుపి ఎటిఎస్  బృందం ఇప్పుడు అనుమానితుడిని ట్రాన్సిట్ రిమాండ్‌పై లక్నోకు తీసుకువస్తుంది.

ఈ బెదిరింపు మెసేజ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ప్రొఫెసర్ నీలకాంత్ తివారికి సోమవారం రాత్రి వచ్చింది. అంతర్జాతీయ ఫోన్ కాల్ నుంచి ఈ బెదిరింపు మెసేజ్ హిందీ, ఇంగ్లీషు, కన్నడ భాషల్లో వచ్చింది. ఈ బెదిరింపు కాల్ కు సంబంధించి మడియాన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

యూపీలో 2, కర్ణాటకలో 4 ఆర్ఎస్ఎస్ కార్యాలయాలను పేల్చివేస్తామని ఆగంతకుడు బెదిరించారు. సైబర్ సెల్ సహాయంతో వాట్సాప్ సందేశం పంపిన ఫోన్ నంబరును గుర్తిస్తామని లక్నో పోలీసులు చెప్పారు. బెదిరింపు నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ కార్యాలయాలకు పోలీసు బందోబస్తు పెంచారు.

ప్రొఫెసర్ నీలకంఠ పూజారికి రెండు రోజుల క్రితం, ఒక వ్యక్తి ‘అల్ అన్సారీ ఇమామ్ రాజీ ఉన్ మెహందీ’ అనే పేరుతో ఉన్న తన వాట్సాప్ గ్రూప్‌లో చేరమని కోరుతూ తన మొబైల్ నంబర్ నుండి ఆయనకు సందేశం పంపాడు. అప్పుడు ఆ వ్యక్తి లింక్ పంపాడు. దీని ద్వారా డాక్టర్ నీలకంఠ్ తన బృందంలో చేరాడు. ఆ మరుసటి రోజు బాంబులతో కార్యాలయాలు పేల్చివేస్తామని బెదిరింపులు పంపాడు.

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగ్‌పూర్‌లో సంఘ్ శిక్షా వర్గ్ ముగింపు కార్యక్రమంలో మత సామరస్యానికి పిలుపునిచ్చిన కొన్ని రోజుల తర్వాత ఈ బెదిరింపు ఘటన జరిగింది. ముస్లింలు తమ పూర్వీకుల వారసులని, రక్తసంబంధం ద్వారా తమ సోదరులని హిందువులు గుర్తించాలని భగవత్ స్పష్టం చేశారు.