కథ రచయిత, నవలారుడు, చిత్రకారుడు, కవి, బహుముఖ ప్రతిభాశాలి శీలా వీర్రాజు కన్నుమూసారు. 1969లో ఆయన మైనా నవల తెలుగు సాహిత్యంలో విశేషమైన ప్రశంసలు అందుకుంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బుధవారం సాయంత్రం హైదరాబాదులోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు.
మైనా నవలకు 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి ప్రాంతంలో జన్మించిన ఆయన 1961 – 63 ప్రాంతంలో క్రిష్ణా పత్రికలో పనిచేశారు. పౌర సంబంధాల శాఖలో అనువాదకుడిగా పనిచేశారు.
కొడిగట్టిన సూర్యుడు కవితా సంపుటికి గాను ఆయనకు 1967లో ఫ్రీవెర్స్ ఫ్రంట్ అవార్డు లభించింది. వెలుగు రేఖలు, కాంతిపూలు, కరుణించని దేవత, మైనా అనే నవలలను ఆయన రాశారు. కొడిగట్టిన సూర్యుడు, హ్రుదయం దొరికింది, మళ్లీ వెలుగు (దీర్ఘ కావ్యం), కిటికీకన్ను, ఎర్రడబ్బా రైలు, పడుగు పేకల మధ్య జీవితం, శీలా వీర్రాజు, బతుకుబాస (నవలా కథకావ్యం) కవితాసంపుటులను వెలువరించారు.
కలానికి ఇటూ అటూ అనే వ్యాస సంపుటిని కూడా వెలువరించారు. ఆయన మరణ వార్త విని తెలుగు సాహిత్య లోకం శోక సముద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు సాహితీ వేత్తలు సంతాపాన్ని తెలిపారు. సాహితీవేత్త ఆయిన ఆయన సతీమణి శీలా సుభద్రాదేవికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
More Stories
మాదిగలు, బిసిలు కాంగ్రెస్కు ఓటేయవద్దు
జీఎస్టీ రిఫండ్ పేరుతో రూ.100 కోట్ల కుంభకోణం
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో అర్జున్ రెడ్డి అరెస్ట్