బూటకపు కిట్టి పార్టీల దశకు దిగజారిన కాంగ్రెస్ 

కాంగ్రెస్ ఇప్పుడు ఫ్యామీలీ ఫోటోల చట్రానికి పరిమితం అయిందని, చివరికి ఇది బూటకపు కిట్టిపార్టీల దశకు దిగజారిందని కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ చచ్చుబడి ఇప్పుడు వెంటిలేటర్లపై ఉందని, అయితే ఆ పార్టీ నేతల దురుసు వైఖరి మితిమీరుతోందని మంత్రి విమర్శించారు.
ఇదంతా కూడా ఈ పార్టీ తలకెక్కిన ప్రతికూల ఫ్యూడల్ మైండ్‌సెట్ ఫలితంగా దాపురించిందని మండిపడ్డాయిరు. కాంగ్రెస్ ఇప్పుడు ఫ్యామీలీ ఫోటోల చట్రానికి పరిమితం అయిందని ఎద్దేవా చేశారు.  ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తిట్టిపోయడం ఓ క్రేజ్‌గా మారిందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీ చచ్చుబడి ఇప్పుడు వెంటిలేటర్లపై ఉందని,  అయితే ఆ పార్టీ నేతల దురుసు వైఖరి మితిమీరుతోందని మంత్రి విమర్శించారు. ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ మాటలు సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉంటుందన్నాయని నక్వీ ఆరోపించారు.
బిజెపి సిద్ధాంతాలను కించపర్చేలా మారుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రతిష్ట దిగజారిందని, చివరికి ఈ పార్టీ గల్లీలకు పరిమితం అవుతోందని పేర్కొన్నారు. ఇదంతా కూడా ఈ పార్టీ తలకెక్కిన ప్రతికూల ఫ్యూడల్ మైండ్‌సెట్ ఫలితంగా దాపురించిందని తెలిపారు.

పార్టీ అంతర్గత పరిణామాలతోనే కాంగ్రెస్ నుండి వలసలు మిక్కుటం అయ్యాయని కేంద్ర మంత్రి చెప్పారు. రాహుల్ ఇతర కాంగ్రెస్ నేతలు విదేశాలకు వెళ్లి మాట్లాడే తీరు దేశాన్ని అప్రతిష్ట పాలుచేసే విధంగా ఉంటోందని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని  విమర్శించేందుకు ఏకంగా దేశాన్ని దిగజార్చే మాటలు అనుచితం అంటూ మండిపడ్డారు.