బల్దియా అధికారులు భాగ్యనగరంలోని నిరాశ్రయుల నీళ్ల కష్టాలు అసలు పట్టించుకోవడం లేదని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు. వేర్వేరు రాష్ట్రాలు, జిల్లాల నుంచి జంటనగరాలకు వలసొచ్చిన వారు నీళ్లు దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంటి అద్దెలు కట్టే స్థోమత లేక, రోడ్లు, నాలాల వెంట గుడిసెలు వేసుకొని గ్రేటర్ పరిధిలో చాలామంది జీవనం సాగిస్తున్నారని ఆమె గుర్తు చేసారు. ఆయా ఏరియాల్లో బజారు నల్లాలు లేక నీళ్ల కోసం పడరాని పాట్లు పడుతున్నరని చెబుతూ నల్లా ఉన్న ఇళ్ల వద్దకు వెళ్లి నీళ్లు అడుక్కొచ్చుకుంటున్నారని తెలిపారు.
ఎండా కాలంలో చాలామంది తమకే నీళ్లు చాలట్లేదంటున్నరని బాధితులు చెబుతున్నరని అంటూ దీంతో మంచినీటి కోసం బిందెలతో వేరే ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నరని ఆమె పెక్రోన్నారు. కాలనీల్లో రోడ్ల పక్కన ఉన్న చేతి పంపులు పని చేయడం లేదని, కనీసం వాటిని రిపేర్ చేసినా తమకు ఎంతో మేలు జరుగుతుందని అంటున్నరని ఆమె చెప్పారు.
ఇలాంటి వారికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన జలమండలి ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని విజయశాంతి విమర్శించారు. గ్రేటర్లోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ సమస్య ఉందని ఆమె చెప్పారు.
గతంలో కొన్నిచోట్ల బజారు నల్లాలు ఉండేవని, అయితే అధికారులు వాటిని తొలగించారని ఆమె తెలిపారు. చలివేంద్రాలకు నీటిని ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించిన జలమండలి ఎండీ, వీరినీ పట్టించుకుంటే బాగుంటుందని ఆమె సూచించారు.
ఇప్పటికైనా బల్దియా అధికారులు వీరికీ నీటి సరాఫరా చేయాలని ఆమె కోరారు. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రం మొత్తం మంచి నీటి సరాఫరా చేస్తున్నమని చెప్పుకునే కేసీఆర్ గారి దగ్గర దీనికి జవాబుందా? అని ఆమె ప్రశ్నించారు. గొప్పలు పక్కన పెట్టి గ్రేటర్లోని నిరాశ్రయుల నీళ్ల కష్టాలు తీర్చాలని విజయశాంతి కోరారు.
More Stories
పట్టభద్రుల ఎంఎల్సికి నోటిఫికేషన్
వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురు కాంగ్రెస్ నేతల అరెస్ట్
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న మంత్రి