ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లో రానున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై కసరత్తు చేసిన ఆయన ఇప్పుడు ఇక తానే ఓ కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు వెల్లడించారు. బీహర్ నుంచి తన ప్రయాణం ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
కాంగ్రెస్లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సొంత కుంపటి పెట్టుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుని ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా బీహార్లో నిన్న భావసారూప్య పార్టీలతో పీకే చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తోంది.
”పదేళ్లుగా ప్రజల పక్షాన విధానాలు రూపొందించాం. అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేశా. ప్రజా సమస్యలు మరింత అర్థం చేసుకోవాల్సి ఉంది. ప్రజలకు చేరువకావాల్సిన సమయం వచ్చింది. సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నా” అని పీకే ట్వీటర్ లో పేర్కొన్నారు.
కాగా, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పీకే ఇటీవల తీవ్రంగా ప్రయత్నించారు. పార్టీని ప్రక్షాళన చేసి జవసత్వాలు నింపేందుకు కొన్ని సూచనలు కూడా చేశారు. అయితే, పార్టీలోకి ఆయన రాకను కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరు వ్యతిరేకించారు.
ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐప్యాక్ దేశంలోని వివిధ పార్టీలకు పనిచేస్తుండడం, అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పీకే చర్చలు జరపడంతో ఆయన తీరుపై కాంగ్రెస్ నేతలు సందేహాలు వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్లో పీకే చేరికకు అడ్డంకి ఏర్పడింది.
More Stories
రాహుల్ గాంధీ `పాకిస్తాన్ అనుచరుడు’
బ్రిజ్ భూషణ్ సింగ్ కు బిజెపి సీట్ నిరాకరణ!
అయోధ్య రామమందిరంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు