ఈ తగ్గుదల పరిణామం 2011లో ప్రారంభమై 2020 వరకు కొనసాగిందని, గత ఆరేళ్లలో వామపక్ష ఉగ్రవాద హింస, భౌగోళిక ఉగ్రవాద వ్యాప్తి చాలావరకు చెప్పుకోతగినంతగా తగ్గిందని నివేదిక వివరించింది. 2013 తో పోల్చిచూస్తే హింసాత్మక సంఘటనలు మొత్తం మీద 41 శాతం (1136 నుంచి 665 ) , వామపక్ష ఉగ్రవాద సంబంధిత మరణాలు 54 శాతం (397 నుంచి 183) వరకు తగ్గాయని వివరించింది.
2019 తో పోల్చి చూసినా 2020 లో కూడా అదే పరిమిత స్థాయిలో హింసాత్మక సంఘటనలు(670 నుంచి 665 ), వామపక్ష ఉగ్రవాద సంబంధిత మరణాలు (202 నుంచి 183) 9 శాతం వరకు తగ్గుదల కనిపించిందని నివేదిక పేర్కొంది. భద్రతా దళాల మరణాలు కూడా 17 శాతం (52 నుంచి 43) వరకు తగ్గాయని వివరించింది.
2020లో చత్తీస్గఢ్లో 315 హింసాత్మక సంఘటనలు, 111 మరణాలు సంభవించి పరమ అధ్వాన్న ప్రభావిత రాష్ట్రంగా నిలిచిందని, తరువాతి స్థానాల్లో ఝార్ఖండ్ (199 సంఘటనలు, 39 మరణాలు), ఒడిశా (50 సంఘటనలు, 9 మరణాలు), మహారాష్ట్ర (30 సంఘటనలు, 8 మరణాలు), బీహార్ (26 సంఘటనలు, 8 మరణాలు) ఉన్నాయని హోం మంత్రిత్వ శాఖ ఉదహరించింది.
దేశం మొత్తమ్మీద వివిధ వామపక్ష ఉగ్రవాద రూపాల ప్రేరేపిత హింసాత్మక సంఘటనల్లో 86 శాతం, సంబంధిత మరణాల్లో 96 శాతం వరకు జరుగుతుండడానికి అత్యంత శక్తివంతమైన సిపిఐ (మావోయిస్టు) కారణమని నివేదిక ఆరోపించింది. ప్రతికూలతలు పెరుగుతున్నప్పటికీ, ఎలాంటి విజయాలు సాధించలేనప్పటికీ రాష్ట్రాల సరిహద్దుల్లో కొత్త ప్రాంతాల్లో తమ నక్సల్ కార్యకలాపాలను విస్తరింప చేయడానికి ప్రయత్నిస్తోందని పేర్కొంది.
More Stories
అనంత్నాగ్ లో మరో వలస కార్మికుడి కాల్చివేత
144 కోట్లకు చేరిన భారత దేశ జనాభా
ఇప్పుడు బ్యాలెట్ ఓటింగ్ విధానం ప్రవేశపెట్టలేం