లేని సమస్యను సృష్టించి కేసీఆర్ రాజకీయం చేయాలనుకుంటాడని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. అందుకు వడ్ల కొనుగోలు వ్యవహారమే సాక్ష్యమని పేర్కొన్నారు.
యాసంగి పంటనంతా కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం చెబుతున్నా నిరుద్యోగుల కోపాన్ని, కరెంటువిద్యుత్ ఛార్జీల పెంపుపై జనంలో ఉన్న ఆగ్రహాన్ని పక్కదారి పట్టించేందుకు వడ్ల సమస్యను తీసుకొచ్చి రాజకీయం చేయాలనుకుంటున్నాడని ఆయన విమర్శించారు.
బీజేపీని బద్నాం చేసేందుకు ఢిల్లీ పోయి ధర్నాలు చేసి, చివరకు మేమే కొంటామని గప్పాలు కొట్టిండని ఇప్పుడు కేంద్రానికి లేఖ రాయడంపై సంజయ్ మండిపడ్డారు. పండించిన పంటనంతా కేంద్రమే కొనాలని కేంద్రానికి కేసీఆర్ లేఖ రాసిన విషయాన్ని ఆయన బయటపెట్టారు. ఒకవైపు మేమే కొంటామని చెబుతూనే మరోవైపు కేంద్రమే కొనాలని ఏప్రిల్ 13న రాసిన లేఖను ఆయన చూపారు.
యాసంగిలో 40.22 లక్షల మెట్రిక్ టన్నుల రైస్ వస్తాయని, వాటన్నింటినీ కేంద్రానికి పంపిస్తామని లేఖలో ప్రస్తావించారని సంజయ్ తెలిపారు. ధాన్యం నేనే కొంటానన్న మొనగాడు ఇప్పుడు కేంద్రానికి ఎందుకు లేఖ రాశారని బండి సంజయ్ ప్రశ్నించారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు సహా అందరినీ ఇబ్బంది పెట్టి సీఎం కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నాడని దుయ్యబట్టారు.
వడ్ల కొనుగోలు విషయంలో డ్రామాలాడి రైతులను అరిగోస పెట్టిండని సంజయ్ మండి పడ్డారు. ఆలంపూర్ నియోజకవర్గంలోని బోరవెల్లి గ్రామంలో మీడియాతో మాట్లాడిన ఆయన బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి లేఖ రాసినచ్చిన కేసీఆర్ఇ ప్పుడు మెడ మీద కత్తి పెట్టి రాయించుకున్నారని అబద్దాలు చెబుతున్నాడని మండిపడ్డారు.
2020-21 సంవత్సరానికి ఇవ్వాల్సిన 9 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఇంకా ఎందుకు ఇయ్యలేదో కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు.
More Stories
హైదరాబాద్లో అమిత్ షాపై కేసు నమోదు
వేముల రోహిత్ దళిత్ కాదు…. కేసు మూసివేత
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదు