భారతదేశం శుక్రవారం విజయవంతంగా ఎస్ఎఫ్డిఆర్ శక్తివంతపు క్షిపణి వ్యవస్థను పరీక్షించింది. ఒడిషా తీర ప్రాంతంలోని బాలాసోర్ ప్రయోగ స్థలి నుంచి దీని పాటవాన్ని పరిశీలించారు. విజయవంతం అయినట్లు నిర్థారించారు.
బాలాసోర్లోని సమీకృత పరీక్ష కేంద్రం (ఐటిఆర్)వేదికగా ఈ పాటవ పరీక్ష జరిగింది. భారీ స్థాయి ఇంధన సామర్థం ఈ క్షిపణి వ్యవస్థ ప్రత్యేకత, లక్షాన్ని నిర్థిష్టంగా ఎంచుకుని శత్రువును దెబ్బతీసేందుకు ఈ మిస్సైల్ సిస్టమ్ ఉపకరిస్తుంది.
అత్యంత దూర లక్షాన్ని కూడా ఈ వ్యవస్థతో శబ్ధవేగాన్ని మించిన వేగంతో దెబ్బతీసేలా ఈ మిస్సైల్ సిస్టమ్ రూపకల్పన జరిగిందని భారత రక్షణ అభివృద్ధి సంస్థ (డిఆర్డిఒ) ఓ ప్రకటనలో తెలిపింది.సంక్లిష్ట క్షిపణి వ్యవస్థలోని ముఖ్యమైన భాగాలన్నీ నమ్మకంగా పని చేస్తున్నట్లు స్పష్టంగా వెల్లడైందని తెలిపింది. ఈ కార్యక్రమ లక్ష్యాలన్నీ నెరవేరినట్లు పేర్కొంది.
హైదరాబాద్లోని డిఆర్డిఒ, ఇమారత్ కేంద్రాలలో సంయుక్తంగా ఈ సిస్టమ్ను రూపొందించారు. ఇప్పుడు దీని పనితీరు, సమర్థతల పరీక్ష జరిగింది. ఎస్ డి ఎఫ్ ఆర్ ఆధారిత ప్రొపల్షన్ వల్ల క్షిపణి గగనతలంలో చాలా దూరంలో ఉన్న ముప్పును సూపర్సోనిక్ వేగంతో అడ్డుకోగలుగుతుందని తెలిపింది.
అనేక రేంజ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా సేకరించిన సమాచారం ఈ వ్యవస్థ పనితీరును ధ్రువీకరించినట్లు తెలిపింది. ఐటీఆర్ ఏర్పాటు చేసిన టెలీమెట్రీ, రాడార్, ఎలక్ట్రో-ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఈ సమాచారాన్ని సేకరించాయని వివరించింది.
ఈ పరీక్షలు విజయవంతమైనందుకు డీఆర్డీవోను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. మన దేశంలో అత్యంత ముఖ్యమైన క్షిపణి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఇది మైలురాయి అని పేర్కొన్నారు.
దీని డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్లలో పాలుపంచుకున్న బృందాలను రక్షణ రంగ పరిశోధన శాఖ కార్యదర్శి, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జీ సతీశ్ రెడ్డి అభినందించారు. ఈ పరీక్షలు విజయవంతం కావడంతో గగనతలం నుంచి గగనతలానికి మిసైల్స్ పరిధిని విస్తరించవచ్చునని తెలిపారు.
More Stories
బెంగళూరు, శివమొగ్గలలో ఎన్ఐఎ దాడులు
బిజాపూర్ ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి
ఆప్ నిరసనలతో ఢిల్లీలో మూడు మెట్రో స్టేషన్ల మూసివేత