టిఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుక్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ ప్రజల పక్షాన, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా భిక్షమయ్యగౌడ్ బీజేపీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
ఇంకా చాలామంది నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. కుటుంబపాలన, అరాచక పాలన అంతం చేయాలన్నదే అందరి లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడే ప్రతి మాట తప్పుదోవ పట్టించేదిగా ఉందని సంజయ్ విమర్శించారు. సీఎం ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా, ఎదురు కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజల దృష్టి మళ్లించి, కాలయాపన చేసి పబ్బం గడుపుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ముడి బియ్యం కొంటామని పక్కాగా చెప్పామని చెబుతూ ఆ విషయంలో మార్పే లేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసులో ఇంతవరకు ఎవరినీ ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారని ప్రశ్నించారు.
డ్రగ్స్పై ఉత్తుత్తి మీటింగ్స్ పెడుతున్నారని, ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడుతున్నా… సీఎం దీనిపై ఇంత వరకు స్పందించడం లేదని బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
More Stories
నిశ్శబ్ద విప్లవ ఫలితం జూన్ 4న తెలుస్తుంది
తెలంగాణాలో రెండంకెల సీట్లు.. కిషన్ రెడ్డి ధీమా
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి మాధవీలతపై కేసు నమోదు