దక్షిణ మధ్య రైల్వే ‘మిషన్ ఎలక్ట్రిఫికేషన్’కు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రత్యేక దృష్టి సారించడంతో 2021- 22 సంవత్సరంలో తన నెట్వర్క్ పరిధిలో మునుపెన్నడూ లేనివిధంగా అత్యుత్తమ పనితీరును కనబరిచి విద్యుదీకరణ పనులను పూర్తి చేసింది. 2021- 22 ఆర్థిక సంవత్సరంలో జోన్ 770 రూట్ కిమీల రైల్వే విద్యుదీకరణ పనులు పూర్తి చేసింది. ఇది జోన్ చరిత్రలో ఆల్టైమ్ రికార్డు. అంతేకాక ఈ సంవత్సరంలో భారతీయ రైల్వేలో ఏ జోన్ కూడా పూర్తి చేయని విధంగా దక్షిణ మధ్య రైల్వే అత్యధికంగా విద్యుదీకరణను పూర్తి చేసింది.
జోన్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విద్యుదీకరణ పనులను వేగవంతంగా చేపట్టారు. ముఖ్యంగా చివరి దశలలో ఉన్న పనులపై ప్రత్యేక దృషి పెట్టారు. మొత్తం 770 రూట్ కిమీలలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణలో 326 కిమీలు, ఆంధ్రప్రదేశ్లో 331 కిమీలు, మహారాష్ట్రóలో 87 కిమీలు మరియు కర్ణాటకలో 27 కిమీలు ఉన్నాయి.
రైల్వే లైన్ల విద్యుదీకరణతో రైలు ఇంజన్ మార్పు చేయవలసిన అవసరం లేకపోవడంతో నిరాటంకంగా రైళ్లను నడపవచ్చు, మార్గ మధ్యలో ప్రయాణికుల, సరుకు రవాణా రైళ్ల నిరీక్షణను తగ్గించే అవకాశాలు ఉండడంతో రైళ్ల సగటు వేగం మెరుగవుతుంది. సెక్షనల్ సామర్థ్యం మెరుగవడంతో ఈ సెక్షన్లలో మరిన్ని రైళ్లను నడిపించడానికి అవకాశాలు పెరుగుతాయి.
దీంతో పర్యావరణ పరిరక్షణ కూడా ఏర్పడుతుంది, అంతేకాక ఇదే సమయంలో ఇంధన ఖర్చు కూడా ఆదా అవుతుంది.
విద్యుదీకరణ పనుల నిర్వహణలో అంకితభావంతో శ్రమించిన జోన్ సిబ్బంది, అధికారుల బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) అరుణ్ కుమార్ జైన్ ప్రత్యేకంగా అభినందించారు.
సంబంధిత ప్రాజెక్టుల విద్యుదీకరణ పనులలో రైల్వే, రైల్వే విద్యుదీకరణ సిబ్బంది సమన్వయంతో సహాయ సహకారాలను అందిపుచ్చుకోవడంపై కూడా జనరల్ మేనేజర్ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే నెట్వర్క్లో అధిక భాగం విద్యుదీకరించబడిరదని , ఇది రాబోయే సంవత్సరాల్లో జోన్ 100 శాతం విద్యుదీకరణను సాధించడంలో తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
More Stories
రుతుపవనాల తర్వాతే ఆహార ధరలు తగ్గుముఖం
ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటా ఉపసంహరణ
నేరస్తులైన రాజకీయ నేతలను అరెస్టు చేయకుండా ఎలా?