భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పివి సింధు స్విస్ ఓపెన్ సంచలనం సృష్టించింది. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో థాయిలాండ్కు చెందిన బుసానన్పై 16-21, 8-21 తేడాతో చిత్తు చేసి టైటిల్ను కైవసం చేసుకుంది. 49 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో సింధు బుసానన్కు అవకాశమివ్వకుండా ఆధిపత్యం చెలాయింది.
కాగా, ఈ ఏడాదిలో సింధుకు ఇది రెండో సూపర్ 300 టైటిల్. ఏడాది ప్రారంభంలో జనవరిలో జరిగిన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టైటిల్ను గెలుచుకున్న సివంధు ఇక ఈ స్విస్ ఓపెన్కు ముందు గత వారం జరిగిన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో సింధు సెమీస్ వరకు వెళ్లి ఓటమి పాలైంది.
ఆ టోర్నీ సెమీఫైనల్లో థాయ్లాండ్ ప్లేయర్ పోర్న్పావీ చోచువాంగ్ చేతి లో 17-21, 9-21 తేడాతో పరాజయం పాలైంది. ఇక మార్చి మొదటి వారంలో జర్మన్ ఓపెన్లో మహిళల సింగిల్స్ రెండో రౌండ్లోనే సింధు వెనుదిరిగి తీవ్ర విమర్శలను మూటగట్టుకుంది.
చైనాకు చెందిన ఝాంగ్యి మాన్ చేతిలో 14-21 21-15 14-21 తేడాతో సింధు ఓటమి పాలైంది. ఇదిలా ఉండగా ఈ టోర్నీ పురుషుల సింగిల్స్లో ఫైనల్కు చేరిన భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్కు నిరాశ ఎదురైంది. ఇండోనేషియాకు చెందిన క్రిస్టో చేతిలో 12-21, 18-21 తేడాతో ఓటమి పాలయ్యాడు.
పివి సింధుకు మఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. స్విస్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకున్న సింధు రానున్న రోజలుల్లో మరెన్నో విజయాలను అధిగమించాలని ఆకాంక్షించారు.
More Stories
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్
భారత్ కు బంగ్లాదేశ్ లో టి20 మహిళా క్రికెట్ సిరీస్
ఇజ్రాయిల్తో వాణిజ్యాన్ని నిలిపివేస్తున్న టర్కీ