జాతీయ ప్రయోజనాల దృష్టితోనే భారత్ విదేశాంగ విధానం

జాతీయ ప్రయోజనాల దృష్టితోనే భారత్ విదేశాంగ విధానం
భారతదేశ విదేశాంగ విధాన నిర్ణయాలు “జాతీయ ప్రయోజనం” దృష్ట్యానే తీసుకొంటామని,  అంతర్జాతీయ క్రమం “ప్రాదేశిక సమగ్రతను, రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలి” అనే నమ్మకంతో మార్గనిర్దేశం చేయబడిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. “హింసను తక్షణమే నిలిపివేయాలని”,  “శాంతి కోసం నిలబడాలని” భారతదేశం పిలుపునిస్తుందని కూడా ఆయన తెలిపారు.

“మా సూత్రాలపై మేము చాలా స్పష్టంగా ఉన్నాము. అంతర్జాతీయ క్రమం తప్పనిసరిగా ప్రాదేశిక సమగ్రతను, రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలనే మా నమ్మకంతో మా విధానం చాలా మార్గనిర్దేశం చేయబడింది…” అని జైశంకర్ రష్యా-ఉక్రెయిన్ వివాదంపై ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ రాజ్యసభలో తెలిపారు.

రష్యా, ఉక్రెయిన్‌లతో సంబంధం ఉన్న పరిస్థితి “మా సమస్య కాదన్నది భారతదేశం వైఖరి కాదు. మేము శాంతి కోసం ఉన్నాము అనేది మా విధానం” అని ఆయన తేల్చి చెప్పారు. ” ఫిబ్రవరి 2022 నుండి ఉక్రెయిన్ నుండి 22,500 మంది భారతీయ పౌరులను, 147 మంది విదేశీయులను ప్రభుత్వం సురక్షితంగా ఇంటికి తీసుకురాగలిగింది” అని గుర్తు చేశారు.

కేరళ కాంగ్రెస్ ఎంపీ జోస్ కె మణి లేవనెత్తిన ప్రశ్నకు ప్రతిస్పందనగా అందించిన వ్రాతపూర్వక ప్రకటనలో, ఉక్రెయిన్ వివాదంపై భారతదేశం విధానం “దృఢంగా, స్థిరంగా” ఉందని స్పష్టం చేశారు. భారతదేశం “దిగజారిపోతున్న పరిస్థితి” పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హింసను తక్షణమే నిలిపివేయాలని. అన్ని శత్రుత్వాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చిందని కూడా గుర్తు చేశారు. .

రష్యా దండయాత్ర, భారత్-అమెరికా వాణిజ్యంపై దాని సంభావ్య ప్రభావాలకు వ్యతిరేకంగా క్వాడ్ దేశాలలో భారతదేశం విధానం “కొంతవరకు అస్థిరంగా ఉంది” అని అమెరికా పేర్కొన్నదని మణి అడిగిన అనుబంధ ప్రశ్నకు జైశంకర్ స్పందిస్తూ: “ఉక్రెయిన్ పరిస్థితిని వాణిజ్య సమస్యలతో ముడిపెట్టే ప్రశ్నే లేదు” అని చెప్పారు.

“ఉక్రెయిన్‌పై మన స్వంత విధానంపై సంబంధించినది. ఇది చాలా స్పష్టంగా ఉంది. ఇది ఆరు సూత్రాలపై ఆధారపడి ఉంటుంది: ఒకటి, హింసకు, అన్ని శత్రుత్వాలకు  తక్షణమే స్వస్తి పలకాలని మనం పిలుపిచ్చాము. మనం శాంతి కోసం నిలబడతాము. రెండు, చర్చలు,  దౌత్య మార్గానికి తిరిగి రావడం తప్ప వేరే మార్గం లేదని మనం నమ్ముతున్నాము.

 
 మూడు, అంతర్జాతీయ చట్టం, యుఎన్  చార్టర్‌లు,  అన్నిదేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారం పట్ల గౌరవం ఆధారంగా గ్లోబల్ ఆర్డర్ లంగరు వేయబడిందని మనం  గుర్తించాము. నాలుగు, మనం  సంఘర్షణ పరిస్థితికి మానవతా ప్రాప్తి కోసం పిలుపునిస్తాము. 
 
ఐదు, మనమే  మానవతా సహాయం అందిస్తాము. మనం  ఇప్పటివరకు 90 టన్నుల మానవతా సహాయం అందించాము. మరిన్ని ముఖ్యంగా మందులు అందించాలని చూస్తున్నాము. ఆరు, మనం ఈ విషయంపై రష్యన్ ఫెడరేషన్, ఉక్రెయిన్ రెండింటి నాయకత్వంతో టచ్‌లో ఉన్నాము, ”అని జైశంకర్ వివరించారు.

అమెరికా, భారతదేశమీ కాకుండా, ఆస్ట్రేలియా, జపాన్ క్వాడ్ గ్రూపింగ్‌లో భాగంగా ఉన్నాయి. శత్రుత్వం చెలరేగినప్పటి నుండి, ప్రధాని నరేంద్ర మోదీ  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మూడుసార్లు, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో రెండుసార్లు మాట్లాడారని మంత్రి గుర్తు చేశారు.

“అధ్యక్షుడు పుతిన్ ఉక్రేనియన్ , రష్యా బృందాల మధ్య చర్చల స్థితిగతులపై ప్రధానికి వివరించారు. రష్యా,  ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న చర్చలను ప్రధాని స్వాగతించారు మరియు.  అవి వివాదానికి విరమణకు దారితీస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు పుతిన్ , అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య ప్రత్యక్ష సంభాషణ కొనసాగుతున్న శాంతి ప్రయత్నాలకు గొప్పగా సహాయపడుతుందని ఆయన సూచించారు, ” అని జైశంకర్ వ్రాతపూర్వక ప్రకటనలో తెలిపారు.

“రష్యా, చైనా మధ్య, చాలా ఇతర దేశాల మధ్య” అంతర్జాతీయ క్రమంలో జరుగుతున్న “అన్ని మార్పుల” గురించి భారతదేశానికి పూర్తిగా తెలుసునని, భారతదేశం దీనిని పరిష్కరించగల స్థితిలో ఉందా అనే అనుబంధ ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన చెప్పారు. 

 రూపాయి-రూబుల్ విధానంలో చమురు కొనుగోళ్లు చేయవచ్చా అని అడిగిన ప్రశ్నకు జైశంకర్, “చెల్లింపు అంశంతో సహా ప్రభుత్వం వివిధ అంశాలను పరిశీలిస్తోంది” అని చెప్పారు.
కానీ భారత్‌కు దిగుమతి అవుతున్న ముడి చమురులో రష్యా నుంచి ఒక్క శాతం కంటే తక్కువేనని పేర్కొంటూ  అనేక ఇతర దేశాలు మనం చేసే దిగుమతుల కంటే 10-20 రెట్లు దిగుమతి చేసుకుంటాయని తెలిపారు. 

ప్రభుత్వ వర్గాల ప్రకారం, భారతదేశపు ముడి చమురు దిగుమతుల్లో ఎక్కువ భాగం పశ్చిమాసియా నుండి (ఇరాక్ 23%, సౌదీ అరేబియా 18%, UAE 11%). అమెరికా ఇప్పుడు భారతదేశానికి (7.3%) ముఖ్యమైన ముడి చమురు వనరుగా మారింది.