ఉత్తరప్రదేశ్లో నివసిస్తున్న ఒక ముస్లిం మహిళ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి ఓటు వేసినందున తన కుటుంబం తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని పేర్కొంది. ఉజ్మాగా గుర్తించిన ఆ మహిళ ఆగ్రహంతో అత్తమామలు తనను కొట్టారని, ఇంటి నుండి బయటకు పంపారని పేర్కొంది.
విడాకులు తీసుకున్న తన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానని అత్తమామలు తనను బెదిరించారని ఆమె తెలిపింది. ఉజ్మాను ఎజాజ్ నగర్ గౌటియా నివాసి తాహిర్ అన్సారీ కుమార్తెగా గుర్తించారు. జనవరి 2021లో తస్లీమ్ అన్సారీతో ఆమె వివాహం జరిగింది. అదే ప్రాంతానికి చెందిన ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం.
ఇటీవల ఆమె ఓటు వేసిన తర్వాత, ఉజ్మా తన అత్తమామలకు తాను బీజేపీకి ఓటు వేసినట్లు చెప్పినట్లు సమాచారం. దానితో కుటుంభ సభ్యులందరు, ముఖ్యంగా ఆమె బావ ఆరిఫ్, మామ ఆగ్రహానికి గురయ్యారు. ఆమెపై దాడికి పాల్పడ్డారు. తన భర్త తనకు విడాకులు ఇస్తానని కూడా వారు బెదిరించారని ఆమె ఆరోపించారు.
ఆమె తండ్రి తాహిర్ అన్సారీ ఒక కార్మికుడు. తనను అత్తమామలు ఇంటి నుండి గెంటేసిన తర్వాత ఆమె పోలీసుల నుండి సహాయం కోరింది.
తంజీమ్ ఉలామా-ఎ-ఇస్లాం జాతీయ ప్రధాన కార్యదర్శి మౌలానా షహబుద్దీన్ రజ్వీ మీడియాతో మాట్లాడుతూ ఓటు వేయడం రాజ్యాంగ హక్కు అని, ఒక వ్యక్తి తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయవచ్చని స్పష్టం చేశారు. బీజేపీకి ఓటు వేసినందుకు విడాకులు తీసుకుంటామని మహిళ అత్తమామలు లేదా భర్త బెదిరిస్తే, ఇస్లామిక్ చట్టాల దృష్టిలో కూడా వారు దోషులేనని ఆయన తెలిపారు.
More Stories
పూంచ్లో ఉగ్రవాదుల కోసం భారీగా గాలింపు
జమ్మూకాశ్మీర్లో భారీ ఉగ్రదాడి.. ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై కాల్పులు
వన్డేలు, టీ20లో అగ్రస్థానంలో టీమ్ఇండియా