
17 ఏళ్లలో (1990-2007) ఉగ్రవాదుల దాడుల్లో 399 మంది కాశ్మీరీ పండిట్లు మాత్రమే మరణించారని, అదే సమయంలో ఉగ్రవాదుల చేతిలో మరణించిన ముస్లింల సంఖ్య 15,000 అని కేరళ కాంగ్రెస్ ట్విట్టర్లో సుదీర్ఘ థ్రెడ్లో పేర్కొంది. తద్వారా కాశ్మీర్ పండిట్ లపై జరిగిన ఊచకోత లెక్కలో లేనిదన్నట్లు తీసిపారవేసే ప్రయత్నం చేసింది.
బిజెపిపై నేరుగా దాడి చేసిన కేరళ కాంగ్రెస్, కాశ్మీరీ పండిట్లు “ఆరెస్సెస్ వ్యక్తి అయిన అప్పటి గవర్నర్ జగ్మోహన్ ఆదేశాల మేరకు” లోయను మూకుమ్మడిగా విడిచిపెట్టారని ఆరోపించింది.
“బిజెపి మద్దతుగల విపి సింగ్ ప్రభుత్వంలో వలసలు ప్రారంభమయ్యాయి” అని పేర్కొంది. “డిసెంబరు 1989లో బిజెపి మద్దతుగల విపి సింగ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాతి నెల జనవరి 1990లో పండిట్ల వలసలు ప్రారంభమయ్యాయి. బీఏపీ ఏమీ చేయలేదు. నవంబర్ 1990 వరకు విపి సింగ్కు మద్దతునిస్తూనే ఉంది” అని గుర్తు చేసింది.
అయితే, గతంలో యూపీఏ ప్రభుత్వం పండిట్లను తరలించేందుకు కృషి చేసిందని, వారికి భద్రత కల్పించిందని పేర్కొంది. జమ్మూలో పండిట్ల కోసం ప్రభుత్వం తమ 5,242 గృహాలను నిర్మించిందని, విద్యార్థుల స్కాలర్షిప్లు, రైతులకు సహాయం వంటి రూ. 1,168.4 కోట్ల విలువైన సంక్షేమ పథకాలతో పాటు ప్రతి కుటుంబానికి ఒకేసారి రూ. 5 లక్షల సహాయం అందించిందని వివరించింది.
పండిట్లు ఇతర కాశ్మీరీల మాదిరిగానే తీవ్రవాద బాధితులని పేర్కొంటూ, “విభజన తర్వాత 1948 మతపరమైన అల్లర్లలో కూడా, జమ్మూలో 1,00,000 మంది కాశ్మీరీ ముస్లింలు చంపబడ్డారు, కానీ పండిట్లపై ప్రతీకార హత్యలు జరగలేదు.” అంటూ పేర్కొన్నది.
టైమ్స్ నౌ డిజిటల్తో ప్రత్యేక ఇంటరాక్షన్లో, ఖేర్ మాట్లాడుతూ కేరళ కాంగ్రెస్ను నిందించారు . అటువంటి ముఖ్యమైన చిత్రం చుట్టూ వివాదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులపై దృష్టి పెట్టడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు.
More Stories
అమృత్సర్లో గుడిపై గ్రేనేడ్ దాడి
పాకిస్థాన్ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్
తమిళనాడులో రూ.1000 కోట్ల లిక్కర్ స్కామ్!