అయితే జరిగిన పరిణామాలపై తాము ఆరాతీస్తున్నామని, ఎన్ని క్షిపణులు ఎక్కడ వచ్చిపడ్డాయనేది అధికారికంగా తెలుసుకుంటున్నామని అమెరికా రక్షణ వర్గాలు వాషింగ్టన్లో తెలిపాయి. నిజాలు నిర్థారించిన తరువాతనే తమ తదుపరి స్పందన ఉంటుందని వెల్లడించారు. ఈ మధ్యనే ఇరాక్లో ఈ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నామని, తమ కార్యాలయాన్ని టార్గెట్ చేసుకున్నారా లేదా అనేది నిర్ధారణ కావాల్సి ఉందని పేర్కొన్నారు.
అమెరికా కాన్సులేట్ వద్ధ పేలిన క్షిపణులతో తలెత్తిన పరిస్థితిని తెలియచేస్తూ శాటిలైట్ బ్రాడ్కాస్ట్ ఛానల్ కుర్దీస్థాన్ ఫోటోలతో వార్తలు వెలువరించింది. అమెరికా కాన్సులేట్ వద్దనే ఉన్న ఈ ఛానల్ ఆఫీసు కిటికి అద్దాలు పగలడం, కొంత మేర ధ్వంసం కావడం వంటి దృశ్యాలను ప్రసారం చేశారు. డమాస్కస్ వద్ద ఇరాక్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇటీవలే ఇరాన్ హెచ్చరించింది.
అప్పటి దాడిలో ఇరాన్ సైనికులు మృతి చెందారు. దీనిని తాము తేలిగ్గా వదిలిపెట్టేది లేదని ఇరాన్ స్పష్టం చేస్తూ వస్తున్న దశలోనే ఇప్పుడు ఇరాక్లోని అమెరికా ఎంబస్సీ వద్ద క్షిపణులు పడటం కీలకం అయింది. ఇరాక్పై ప్రతీకార చర్యలో భాగంగానే ఇప్పుడు ఇరాన్ స్వయం నిర్మిత ఫతే 110 క్షిపణులను ప్రయోగించిందని ఇరాక్ అధికారి ఒకరు తెలిపారు.
అయితే ఈ క్షిపణి ఏ స్థాయిలో శక్తివంతం అయి ఉందనేది, ఇతర వివరాలను వెల్లడించలేదు. ఇప్పుడు జరిగిన దాడి అరాచకం, గర్హనీయం, ఇరాక్ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసే చర్య అని అమెరికా అధికారి ఒకరు స్పందించారు. ఇరాక్, సిరియాలలోని తమ స్థావరాలపై ఇటీవలి కాలంలో ఇరాన్ , ఇరాన్ ప్రేరేపిత తీవ్రవాద శక్తుల నుంచి పలు రకాల భీకర దాడులు జరుగుతున్నాయని, వీటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇటీవలే అమెరికా సైనిక దళాల ఉన్నత అధికారి ఒకరు ఇటీవలే వ్యాఖ్యానించారు.
ఇరాక్లో చాలాకాలంగా అమెరికా సేనలు తిష్టవేసుకుని ఉండటం, వ్యూహాత్మకంగా తమకు వ్యతిరేకంగా అమెరికా పావులు కదపడటం వంటి పరిణామాలతో ఇరాన్ ఆగ్రహంతో ఉంది. పలు మార్లు అమెరికాకు, ఇరాక్కు తీవ్రస్థాయి హెచ్చరికలు వెలువరిస్తూ వస్తోంది. ఇప్పటి మిస్సైల్స్ దాడులను ఖండిస్తున్నట్లు, వీటిని ఎవరు జరిపారనేది తమకు తెలియనట్లు తాజాగా ఇరాన్ ఓ ప్రకటన వెలువరించింది.
More Stories
తెలంగాణలో ‘గాడిద గుడ్డు’ పాలన
వేముల రోహిత్ దళిత్ కాదు…. కేసు మూసివేత
దుమారం రేపుతున్న బెంగాల్ గవర్నర్ పై లైంగిక ఆరోపణలు