రష్యాకు వ్యతిరేకంగా అమెరికా, ఈయూ దేశాలు విధిస్తున్న ఆంక్షలు భారత్పైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ ఇంధన అవసరాలు, ఆహార దిగుమతులు అత్యంత ఖరీదుగా మారుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థలోనూ అనూహ్య మార్పులు ఏర్పడతాయని నిపుణులు భావిస్తున్నారు.
రష్యాను ‘స్విఫ్ట్’ (అంతర్జాతీయ నగదు లావాదేవీల వేదిక) నుంచి బహిష్కరించిన నేపథ్యంలో ప్రపంచ ఆర్థికరంగంలో పెను తుఫాన్ సంభవించవచ్చు. రష్యా, ఉక్రెయిన్ గోధుమ ఎగుమతుల్లో పావువంతు ఇంకా నౌకలకు ఎక్కలేదు. ఐరోపా గోధుమ, బార్లీ, మొక్కజను అవసరాలు ప్రధానంగా ఉక్రెయిన్ ద్వారానే తీరుతున్నాయి.
ఇప్పుడు రష్యాపై అమెరికా, ఈయూ సమాఖ్య విధించిన ఆంక్షలు ముందు ముందు పరిస్థితిని మరింత దిగజార్చుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచంలో గోధుమ, మొక్కజన్న ఉత్పత్తిలో రష్యా, ఉక్రెయిన్లది అతిపెద్ద వాటా. ఆంక్షల వల్ల ఈ వీటి సరఫరా గొలుసు దెబ్బతినటం భారత్లాంటి దేశాలకు అనేక సమస్యలు తెచ్చిపెట్టె అవకాశాలున్నాయి.
ఉత్తరప్రదేశ్ ఎనిుకల పోలింగ్ ముగిసిన మరుక్షణం ధరల పోటు ఉంటుందని వార్తలు వెలువడుతున్నాయి. ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెంపు, నిత్యావసర సరుకుల ధరల పెంపు..ఇవనీు ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా తప్పని పరిస్థితులు నెలకొనే అవకాసహం ఉంది.
స్విఫ్ట్ వేదిక నుంచి రష్యాను తొలగించటం భారతీయ బ్యాంకులపైనా ప్రభావం పడగలదని భావితున్నారు. భారత్-రష్యా వాణిజ్య లావాదేవీలు ఎస్బీఐ, కెనరా, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ..వంటి ప్రఖ్యాత బ్యాంకుల ద్వారా జరుగుతున్నాయి.
ఇరు దేశాల వాణిజ్యం నేపథ్యంలో భారత్కు చెందిన చిన్న, పెద్దా ఎగుమతిదార్లకు ఈ బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు అందాయి. స్విఫ్ట్ నుంచి హఠాత్తుగా రష్యాను తొలగించటం ద్వారా ఆ ఎగుమతిదార్ల వాణిజ్యం ప్రమాదంలో పడింది.
అంతర్జాతీయ బ్యాంకు చెల్లింపుల మధ్యవర్తి వేదిక అయిన ‘స్విఫ్ట్’ నుంచి రష్యాను ఈయూ, అమెరికా, ఇతర దేశాలు వెలివేశాయి. రెండొందల దేశాలకు చెందిన 11వేల బ్యాంకులు, ఆర్థిక సంస్థలు స్విఫ్ట్లో సభ్యులుగా ఉన్నాయి. ఒక దేశం నుంచి మరో దేశానికి సులువుగా డబ్బు బదిలీ కావడానికి ‘స్విఫ్ట్’ వ్యవస్థ తోడ్పడుతుంది.
More Stories
ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
ఎయిరిండియాలో ఇక ఉచిత లగేజి 15 కిలోలు మాత్రమే
బంగారం స్మగుల్డ్ చేస్తూ చిక్కిన అఫ్ఘన్ దౌత్యవేత్త