రామమందిరం వలే సరస్వతి నదికి ఆధారాలు చూపాలి 

అయోధ్యలో రామమందిరం పూర్వం ఉన్నట్లు ఏ విధంగా ఆధారాలతో నిరూపించారో, అదే విధంగా సరస్వతి నది గతంలో మనుగడలో ఉన్నదన్న వాస్తవాన్ని సహితం ఆధారాలతో నిరూపించాలని  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సంఘచాలక్

ఢిల్లీలో `ద్విరూప సరస్వతి’ గ్రంధాన్ని ఆవిష్కరిస్తూ నేటితరం ఆధారాలు ఉంటేగాని మన ప్రాచీన వారసత్వానికి సంబంధించిన ఏ విషయాన్నీ నమ్మలేరని, లేని పక్షంలో కల్పిత గాధలు అనుకుంటున్నారని స్పష్టం చేశారు. రామసేతు వంటి అంశాలపై కూడా ఆధారాలు ప్రజల ముందుంచడం చాలా అవసరమని చెప్పారు.

నేటి విద్యావిధానం విశ్వాసాలను ప్రోత్సహింపదని చెబుతూ తగు ఆధారాలతో సరస్వతి నది గురించి పాఠ్యగ్రంధాలలో ఉంచాలని సూచించారు. దేశ ప్రాచీన గొప్పతనాన్ని విద్యావంతులు వెలికి తీసి పుస్తక రూపం ఇవ్వాలని, అలా దేశ చరిత్రలో మరుగున పడిన అనేక అంశాలను విశ్వసనీయతతో ప్రజలకు అందించగలమని ఆయన చెప్పారు.

“దేశాన్ని ప్రపంచం ముందు విశ్వగురువుగా నిల్చోబెట్టాలి. భారతదేశ ఖ్యాతిని నిర్మించాలంటే, ప్రాచీన కాలం నుంచి నేటి వరకు కొనసాగిన విధానాల్ని, సత్యాల్ని ప్రజలకు తెలియజేయాలి. ఇందుకు విద్యావంతులు పూనుకుంటే మన దేశ ప్రాచీనత గురించి ప్రజల్లో మరింత అవగాహన, నమ్మకాన్ని కల్పించగలం. ప్రతిదాన్ని ఆధారాలతో సహా పుస్తకాలు ముద్రించాలి” అని స్పష్టం చేశారు.
దేనికైనా ఆధారం తప్పనిసరి అని చెబుతూ ఉదాహరణకు . మనం రామసేతు గురించి మాట్లాడితే ప్రజలు దాన్ని కల్పితమని అనుకుంటుని పేర్కొన్నారు. కానీ రామసేతుకు సంబంధించిన ఆధారాలను మనం చూపించగలగాలని మోహన్ భాగవత్ సూచించారు. సరస్వతి నదికి మన చరిత్రలో చాలా సంబంధం ఉన్నదని చెబుతూ అయితే బ్రిటిష్ వారు మనకంటూ గర్వించదగిన వారసత్వం  గాని, సంపద గాని లేదని, అంతా మిగిలిన ప్రపంచం నుండే తెచ్చుకున్నామనే అబద్దాలను ప్రచారం చేశారని డా. భగవత్ పేర్కొన్నారు.
ఒకప్పుడు సరస్వతి నది నెలకొన్న ప్రాంతంలో భూమి క్రింద నీటి వనరులు ఉపగ్రహ చిత్రాలలో కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. అందుకనే సరస్వతి నది ఎక్కడ నుండి ఎక్కడికి ప్రవహించిందో అనే వాస్తవాలను వెలుగులోకి తీసుకు రావాల్సిందే అని స్పష్టం చేశారు.  ఈ విషయంలో ప్రభుత్వం, పాలనా యంత్రాంగం తాము చేయవలసిన కృషి చేస్తున్నదని, కానీ ప్రజలు సహితం తమ వంతు కృషి చేయాలని సూచించారు.
మనం రామసేతు గురించి చెప్పిన్నప్పుడు అందరు కల్పిత కధలుగా భావించేవారని, కానీ క్రమంగా ఆధారాలు బయట పడుతూ ఉండడంతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని డా. భగవత్ గుర్తు చేశారు.
మాజీ కేంద్ర మంత్రి డా. మురళి  మనోహర్ జోషి మాట్లాడుతూ ఒక వర్గం ఏ విధంగా మన ప్రాచీన చరిత్రను ప్రశ్నిస్తుందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మేధావులు అనుకొంటున్న కొందరు మన చరిత్రకు, వారసత్వానికి చెదలు పట్టించే ప్రయత్నం చేయడంతో నన్ను  పార్లమెంట్ లో సంస్కృత భాష బోధన ప్రోత్సహిస్తున్నానని విమర్శలు గుప్పించారని ఆయన గుర్తు చేశారు.