చాప్టర్ 7 తీర్మానం ఆమోదం పొందితే, రష్యా దాడిని తిప్పికొట్టేందుకు సైనిక సామర్థ్యాన్ని వినియోగించేందుకు అవకాశం కలుగుతుంది. చాప్టర్ 6 తీర్మానం అయితే శాంతియుత పరిష్కారానికి కృషి చేయడానికి వీలు కల్పిస్తుంది. భద్రతా మండలిలో రష్యా సహా 15 దేశాలకు సభ్యత్వం ఉంది.
దీంతో చాప్టర్ 7 తీర్మానానికి అనుకూలంగా రష్యా మినహా మిగిలిన దేశాలన్నీ ఓటు వేసే విధంగా బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతుతో అమెరికా తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే ఈ ఓటింగ్కు చైనా గైర్హాజరయ్యే అవకాశం ఉంది. భారత్ ఈ అంశంపై తటస్థంగా ఉంది. భారత దేశం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రష్యాను ఏకాకిని చేయడం కోసం ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని భారత్, చైనాలను అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ గట్టిగా కోరుతున్నారు.
ఈ తీర్మానంపై రష్యా వీటో చేసే అవకాశం ఉండటంతో, దీనిని సాధారణ సభలో ప్రవేశపెట్టి, ఆమోదం పొందాలని అమెరికా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ సభలో వీటో అధికారం ఏ దేశానికీ లేదన్న సంగతి తెలిసిందే. ఈ ముసాయిదా తీర్మానం ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండించింది. రష్యాను తిప్పికొట్టేందుకు బలగాలను ప్రయోగించేందుకు అధికారం కల్పించాలని కోరింది.
ఉక్రెయిన్ నుంచి తక్షణమే వెనుకకు వెళ్ళాలని రష్యాను డిమాండ్ చేసింది. సైన్యాలను ఉక్రెయిన్ నుంచి బేషరతుగా ఉపసంహరించుకోవాలని కోరింది. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్య్రం, సార్వభౌమాధికారాలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. అంతర్జాతీయ శాంతిభద్రతల ఉల్లంఘిస్తూ రష్యా దురాక్రమణకు పాల్పడిందని ఆరోపించింది.
More Stories
పాక్ లో ఉగ్రదాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి
నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయుడి అరెస్ట్
ఐరాసలో పాలస్తీనాకు అనుకూలంగా ఓటేసిన భారత్