కన్నెగంటి పోరాటాన్ని పలువురు ప్రముఖులు సైతం పలు సందర్భాలలో కొనియాడారని, వారిలో కవికోకిల గుర్రం జాషువా, మాజీ ముఖ్యమంత్రి కాసు ప్రహ్మానందరెడ్డి వంటి ఎంతోమంది ఉన్నారని వారు గుర్తు చేశారు.
పల్నాడు సీమలో అడవుల్లో పుల్లలు ఏరుకోవడం, పశువులను మేపడంపై బ్రిటీష్ పాలకులు ఆంక్షలు విధించారు. పశువులకు రెండు రూపాయలు శిస్తుగా కట్టాలని ఆదేశించారు. మహాత్మాగాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమానికి ఉత్తేజితుడైన కన్నెగంటి హనుమంతు పుల్లరి ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకించాడు.
అయితే బ్రిటీష్ జనరల్ టి.జి. రూథర్ ఫర్డ్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కొంతమంది నయవంచకులను చేరదీశాడు. ఎప్పటికప్పుడు కన్నెగంటి కదలికలను తెలుసుకొని ఆయనను మట్టుబెట్టాలని ప్రయత్నాలు చేశాడు. దాంతో బ్రిటీష్ జనరల్ టి. జి. రూథర్ ఫర్డ్ ఒక కుట్ర పన్నాడు. 1922 ఫిబ్రవరి 22 కొందరు అటవీ, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులతో మించాలపాడు గ్రామానికి వచ్చాడు.
ఈ విషయం తెలుసుకొన్న కన్నెగంటి అధికారులతో మాట్లాడి పుల్లరి చెల్లించి రావడానికి ఆ దిశగా వెళ్లాడు. ముందస్తు హెచ్చరిక లేకుండా కన్నెగంటిని బ్రిటీష్ సేనలు చుట్టుముట్టి కాల్పులు జరిపాయి. కన్నెగంటి శరీరంలోకి 26 తూటాలు దూసుకుపోయాయి. సాయంత్రం 6 గంటలకు తుపాకి తూటాలకు గాయపడిన పల్నాటి సింహం కన్నెగంటి అర్ధరాత్రి వరకు శక్తి కూడదీసుకొని వందేమాతరం అని నినాదాలు చేస్తూనే ఉన్నాడు. అర్ధరాత్రి దాటాక పల్నాటి వీరబిడ్డడు అమరుడయ్యాడు.
ఆ మహావీరుడు దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈ ఫిబ్రవరి 22 తేదీకి 100 సంమవత్సరాలు పూర్తి కావస్తున్నందున నూతనంగా ఏర్పడబోయే “పల్నాడు జిల్లా” ను “కన్నెగంటి హనుమంతు పల్నాడుజిల్లా” గా నామకరణం చేయడం అంతటి స్వాతంత్య్ర సమరయోధునికి, నిష్కళంక దేశభక్తునికి, వీర విప్లవ వేగుచుక్కకు మనం ఇవ్వగల నిజమైన నివాళి కాగలదని పల్నాడు మేధావుల వేదిక తెలిపింది.
ఈ విషయాలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రతిపాదిత “పల్నాడు జిల్లా”కు ముందు కన్నెగంటి హనుమంతు పేరును చేర్చి “కన్నెగంటి హనుమంతు పల్నాడు జిల్లా”గా మార్చే విధంగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించవలసినదిగా వారు జిల్లా కలెక్టర్ ను కోరారు.
More Stories
7, 8 తేదీల్లో ప్రధాని మోదీ ఏపీలో పర్యటన
జగన్ అక్రమాస్తుల కేసుపై ప్రత్యేక కోర్టు కోరిన సీబీఐ
రజాకార్ల గుప్పిట్లో నుండి హైదరాబాద్ విముక్తికై బిజెపికి ఓటు