హిందూ ద్రోహి మంత్రి ఆదిమూలపు సురేష్

`హిందూ ద్రోహి’ మంత్రి ఆదిమూలపు సురేష్ సహకారంతో గోడ్రాలికొండ తిరుమలనాథస్వామి దేవస్థానం దగ్గర ఏర్పాటు చేసిన అన్యమత చిహ్నాలు తొలగించాలని,  చర్చి నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ బిజెపి మహిళల నాయకత్వంలో ఒంగోలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా జరిపారు.  

రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి  సాధినేని యామిని శర్మ, ఒంగోలు పార్లమెంటు జిల్లా బీజేపీకి అధ్యక్షులు శిరసనగండ్ల శ్రీనివాసులు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. సాధినేని యామిని శర్మ మాట్లాడుతూ పెద్దారవీడు మండలం రాజం పల్లి గ్రామంలో వెలసిన గోడ్రాలి కొండ తిరుమల స్వామి దేవాలయం దగ్గర అక్రమంగా ఏర్పాటు చేసిన అన్యమత చిహ్నాలు తొలగించాలని డిమాండ్ చేశారు. 

 ప్రకాశం జిల్లా కలెక్టర్ కు బిజెపి ఒంగోలు పార్లమెంటు కమిటీ తరఫున వినతిపత్రం సమర్పించారు. హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని దెబ్బతీసే విధంగా కొంతమంది అన్యమతస్తులు గొడ్రాలు కొండపై అన్యమత చిహ్నాలు అక్రమంగా అనుమతిలేకుండా ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని వారు ధ్వజమెత్తారు.

గొడ్రాలి కొండపై శిలువను పెట్టిన అందరి పై కేసులు పెట్టాలని,  మత విద్వేషాలు రెచ్చగొడుతున్న మంత్రి సురేష్ వెంటనే రాజీనామా చేయాలి ఒంగోలు పార్లమెంటు జిల్లా బిజెపి డిమాండ్ చేస్తుంది. ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు  కోటేశ్వరి, జిల్లా ప్రధాన కార్యదర్శి వైవీ గౌతమ్ అశోక్, బీజేపీ ఒంగోలు పార్లమెంటు ఉపాధ్యక్షులు పివి శివా రెడ్డి , బొమ్మసాని పద్మావతి తదితరులు పాల్గొన్నారు.