భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశానికి కుటుంబ పాలన ప్రమాదకరమని ప్రధాని మోదీ హెచ్చరించారు. పార్టీల్లో సంస్థాగతంగా ప్రజాస్వామ్య విలువలు, ఆదర్శాలను జోడించాలని రాజ్య సభలో ప్రధాని కోరారు. దేశంలో అతి పురాతన పార్టీ అయినా కాంగ్రెస్ నుంచి ఇది మొదలవ్వాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ దీన్ని పాటించి.. అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు.
‘భారత్ 1947లో పుట్టిందనే తప్పుడు భావనలో కొందరు ఉన్నారు. దాని వల్లే చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 50 ఏళ్లు దేశాన్ని ఏలే అవకాశం వచ్చిన పార్టీ పాలన పైన ఈ ఆలోచన ప్రభావం చూపింది. ఈ వికారాలన్నింటకీ ఆ భావనే కారణం. ఈ ప్రజాస్వామ్య దేశానికి మీ (కాంగ్రెస్) దయ అనవసరం’ అని ప్రధాని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యానికి భారత్ పుట్టినిల్లు అని ప్రపంచం ముందు చెప్పడానికి వారు భయపడ్డారని ప్రధాని ఎద్దేవా చేశారు. డెమొక్రసీ, డిబేట్ (ప్రజాస్వామ్యం, చర్చలు) భారత్ లో ఎన్నో శతాబ్దాలుగా ఉనికిలో, ఆచరణలో ఉన్నాయని చెబుతూ వారసత్వ రాజకీయాలను దాటి కాంగ్రెస్ ఏమీ ఆలోచించలేదని ధ్వజమెత్తారు.
వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలతో భారత్ కు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని అందరూ ఒప్పుకోవాలని ప్రధాని స్పష్టం చేశారు. ఏదైనా పార్టీలో ఓ కుటుంబమే కీలకంగా మారినప్పుడు.. ఆ ఫ్యామిలీ వ్యక్తుల్లో ఎవరిలో అత్యుత్తమ ప్రతిభ దాగుందనేది ముఖ్యంగా మారుతుందని ప్రధాని చెప్పారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తీరుపై కూడా రాజ్యసభలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీని విభజించే సమయంలో పార్లమెంటులో మైకులు కట్ చేశారు. తలుపులు మూసేశారు. మిర్చి స్ప్రే చేశారు. ఎలాంటి చర్చా జరగలేదు. ఈ తీరు సరైనదేనా? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే?’ అంటూ ప్రశ్నించారు.
అటల్ జీ ప్రభుత్వం కూడా మూడు రాష్ట్రాల (ఛత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్)ను ఏర్పాటు చేసిందని ప్రధాని గుర్తు చేశారు. ఆ ప్రక్రియ శాంతియుతంగా జరిగింది. అందరూ కలసి చర్చించి, నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్ర, తెలంగాణ విషయంలోనూ ఇలాగే జరిగి ఉండాల్సిందని స్పష్టం చేశారు.
తాము తెలంగాణ వ్యతిరేకులం కాదని, అయితే, కాంగ్రెస్ అహంకారం వల్లే అప్పుడు కఠిన పరిస్థితుల మధ్య రాష్ట్ర విభజన జరిగిందని తెలిపారు. దాని వల్ల ఇప్పటికీ ఏపీ, తెలంగాణలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నాయని, అదే సమయంలో కాంగ్రెస్ కు దాని వల్ల రాజకీయంగానూ ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు.
More Stories
ఏపీలో పోలింగ్ ముగిసినా పలుచోట్ల హింసాత్మక ఘటనలు
సొంత ఇల్లు, కారు, భూమి, షేర్లు లేని ప్రధాని మోదీ
తిహార్ జైలును పేల్చేస్తామని బెదిరింపు