ముఖ్యమంత్రి కేసీఆర్పై దేశద్రోహం కేసు వేయాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎం ఎల్ సి ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. రోజుకో గంట పాటు కోర్టుల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించిందని చెప్పారు. ఫిబ్రవరి 14నుంచి కోర్టుల ముందు ‘చేంజ్ సీఎం.. నాట్ కానుస్టూషన్’ పేరుతో బీజేపీ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై న్యాయపోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగానికి సంకెళ్లు వేయాలని టీఆర్ఎస్ భావిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరసన తెలిపితే.. నాన్ బెయిలబుల్ కేసులు పెడ్తున్నారన్నారని రామచంద్రరావు వాపోయారు. ప్రధాని మోదీ బాడీ షేమింగ్పై కేసీఆర్ కామెంట్స్ను ఖండిస్తున్నామని తెలిపారు. దేశ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను వ్యక్తిగతంగా అవమానించేలా మాట్లాడటం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.
రాజకీయ దురుద్దేశంతోనే రాజ్యాంగాన్ని తిరిగి రాయాలాంటూ అంబేద్కర్ను అవమానించారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగం రచించిన వారందరినీ కేసీఆర్ అవమానించారనీ చెబుతూ “దీనిని దేశ వ్యతిరేక చర్యగా ఆయన అభివర్ణించారు. కేసీఆర్పై బీజేపీ ధర్మ యుద్ధాన్ని ప్రారంభిస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై కోర్టుల్లో ప్రైవేటు కేసులు వేస్తామని రామచంద్రరావు వెల్లడించారు.
అంబేద్కర్ రాజ్యాంగమంటే కేసీఆర్ కు గిట్టదు
More Stories
దేశంలోనే సుసంపన్న రాష్ట్రం తెలంగాణ
ఇన్కాయిస్కు సుభాష్ చంద్ర బోస్ పురస్కారం
20 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం?