బిపిన్ రావత్, కళ్యాణ్ సింగ్, టీకా వీరులకు `పద్మ’ అవార్డులు

ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన మొదటి సిసిఎస్ జనరల్ బిపిన్ వార్త, మాజీ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్, మాజీ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి గులాబీ నబి ఆజాద్, మాజీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యలతో పాటు కరోనా టీకాలను మొదటగా ఉత్పత్తి చేసిన పారిశ్రామిక వేత్తలకు సహితం ఈ ఏడాది ప్రతిష్టాకరమైన `పద్మ’ అవార్డులను ప్రకటించారు.

అయితే బుద్ధదేవ్ భట్టాచార్య ఈ పురస్కారాన్ని తిరస్కరించారు. తమ పార్టీవారు ఇటువంటి పురస్కారాలు స్వీకరింపరాని సిపిఎం నాయకులు ప్రకటించారు. నలుగురు పద్మవిభూషణ్, 17 మంది పద్మ భూషణ్, 107 మంది పద్మశ్రీకి ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణకు ఒక పద్మ భూషణ్‌తో పాటు 3 పద్మశ్రీ, ఏపీకి 3 పద్మశ్రీ అవార్డులు వచ్చాయి.

పూనావాలా, సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌లకు పద్మ భూషణ్‌ దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌కు ఇటీవల హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌తో పాటు రాధేశ్యామ్‌ ఖేమ్కా (మరణానంతరం), కల్యాణ్‌ సింగ్‌ (మరణానంతరం), ప్రభా ఆత్రే ఎంపికయ్యారు.

పద్మ భూషణ్‌కు మాజీ కాంగ్రెస్‌ లీడర్‌ గులాం నబీ ఆజాద్, పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం, సీపీఐ (ఎం) నేత బుద్ధదేవ్‌ భట్టాచార్య, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తయారు చేసిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సంస్థ చైర్మన్‌ సైరస్‌ పూనావాలా, కరోనా వ్యాక్సిన్‌ కొవాగ్జిన్‌ను దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్‌ బయోటెక్‌ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్, పంజాబీ ఫోక్‌ సింగర్‌ గుర్మీత్‌ బవ, నటుడు విక్టర్‌ బెనర్జీ, కేంద్ర మాజీ హోం సెక్రటరీ రాజీవ్‌ మెహ్రిశ్రీలను కేంద్రం ఎంపిక చేసింది. 

తమిళనాడు రాష్ట్రం నుంచి నటి షావుకారు జానకి, అలాగే ఒలింపిక్స్‌లో బంగారు పథకం సాధించిన నీరజ్‌ చోప్రా, సింగర్‌ సోనూ నిగమ్‌లు పద్మశ్రీకి ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వాళ్లకు ఏటా ఈ అవార్డులను ఇస్తుంటారు.

ఈసారి మొత్తం 128 అవార్డులను ప్రకటించారు. అవార్డులు పొందిన వాళ్లలో 34 మంది మహిళలున్నారు. 10 మందిని విదేశీ, ఎన్నారై, పీఐఓ, ఓసీఐ విభాగంలో ఎంపిక చేసింది. 13 మందికి మరణానంతరం అవార్డులు ప్రకటించింది. ఇద్దరికి కలిపి ఒకే అవార్డును ఈసారి రెండు సందర్భాల్లో ఇచ్చింది.

తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఏడుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణ నుంచి నలుగురు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురు ఉన్నారు. పద్మ భూషణ్‌కు తెలంగాణ నుంచి భారత్‌ బయోటెక్‌ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులు ఎంపికయ్యారు. 

అలాగే తెలంగాణ నుంచి దర్శనం మొగులయ్య (కళలు), రామచంద్రయ్య (కళలు), పద్మజారెడ్డి (కళలు).. ఏపీ నుంచి గోసవీడు షేక్‌ హాసన్‌ (కళలు) (మరణానంతరం), డాక్టర్‌ సుంకర వెంకట ఆది నారాయణరావు (వైద్యం), గరికపాటి నరసింహారావు (సాహిత్యం, విద్య)లను పద్మశ్రీ వరించింది.