కెనడా సరిహద్దుల్లో నలుగురు భారతీయుల మృతి … కెనడా విచారం 

కెనడా-అమెరికా సరిహద్దులో తీవ్రమైన గడ్డకట్టే చలి కారణంగా శిశువుతో సహా నలుగురు భారతీయులు మృతి చెందిన సంఘటన మనసుని కదిలించే విషాదంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూడో మాట్లాడుతూ ‘అమెరికా సరిహద్దుల గుండా ప్రజల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తోంది. ఇది పూర్తిగా మనసును కదిలించే విషాదం’ అని తెలిపారు. 

`మానవ అక్రమ రవాణాదారుల బాధితులు మెరుగైన జీవితాన్ని నిర్మించుకోవాలనే కోరిక నెరవేరకుండానే ఆ కుటుంబం అలా చనిపోవడం చాలా విషాదకరం. ప్రజలు అక్రమంగా సరిహద్దులు దాటకుండా కట్టడిచేసేలా తాము చేయగలిగినదంతా చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. 

అయితే మృతులంతా గుజరాత్‌కి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు అని, తీవ్రమైన చలికి గురికావడం వల్లే మరణించారని తెలిపారు. మంచుతుఫానులో ఈ కుటుంబం చిక్కుకున్నట్లు తాము గుర్తించాం అని చెప్పారు. ఈ మేరకు కెనడాలోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియా మరణించిన వారి జాతీయతను ధృవీకరించడమే కాక, ఈ సంఘటనను తీవ్ర విషాదంగా అభివర్ణించారు.

 మరోవంక ఈ దుర్ఘటన పట్ల భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.  అమెరికా, కెనడాలోని భారత రాయబారులతో మాట్లాడారు. అక్కడి పరిస్థితులపై తక్షణం స్పందించాలని వారికి సూచించారు.రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీసు (ఆర్‌సిఎంపి) తెలిపారు. ఇద్దరు వయోజనులు, యుక్త వయస్కులు ఒకరు, చిన్నారి మృతదేహలు ఇరు దేశాల సరిహద్దుల్లోని కెనడా వైపు ఎమర్సన్‌ వద్ద లభించాయని చెప్పారు.