
భారత్ లో కరోనా విజృంభణ ఒక వంక కొనసాగుతుండగా, రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉండగా,మరోవంక టీకాల కార్యక్రమం కూడా ముమ్మరంగా సాగుతున్నది. కరోనాను ఎదుర్కొనేందుకు టీకాలు మన దేశంలో అందుబాటులోకి వచ్చి నేటితో ఏడాది పూర్తవుతుంది. గత ఏడాది ఇదే రోజున, దేశ వ్యాప్తంగా ప్రజల కోసం ప్రభుత్వం టీకాల ప్రక్రియ ప్రారంభించింది.
నేడు ప్రతీ పల్లె, గ్రామంలో కూడా కరోనా టీకా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా కరోనాపై పోరులో భారత్ మరో కీలక మైలురాయిని చేరింది. పూర్తిగా ఉచితంగా ప్రారంభించిన కరోనా టీకాల కార్యక్రమం ఇండియాలో అన్ని వర్గాల ప్రజలకు చేరువైంది. గతేడాది జనవరి 16న ఫ్రంట్ లైన్ వర్కర్లకు క్సినేషన్ ఇవ్వడం మొదలైంది. మార్చి 1 నుంచి వ్యాధిగ్రస్తులు, వృద్దులకు టీకాలు ఇవ్వడం ప్రారంభించారు.
ఆ తర్వాత ఏప్రిల్ 1 నుంచి దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారందరికి టీకాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈనెల 3 నుంచి 15-18 ఏళ్ల టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు. అయితే ప్రారంభంలో వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలామంది భయపడ్డారు.
కొందరు భయంతో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారు కూడా ఉన్నారు. అనేక అనుమానాలు, అపోహల మధ్య దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అయినప్పటికీ… తక్కువ కాలంలోనే అనేక రికార్డులు సొంతం చేసుకుంది. దేశంలో ఇప్పటి వరకు 156 కోట్ల కరోనా డోసులను ఇచ్చారు.
ఇందులో 90 కోట్లు మొదటి డోసులు కాగా…65 కోట్ల డోసులు రెండో డోసు. దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లు ఉచితంగా ప్రజలకు అందించారు. ఇక రెండు డోసులు పూర్తయిన వారికి… ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కొనేలా బూస్టర్ డోసు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. దీంతో పలువురు ప్రముఖులు.. ప్రజలు.. బూస్టర్ డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకున్నారు.
More Stories
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంకై ఆర్ఎస్ఎస్ పిలుపు
అంతరిక్షంలో భగవద్గీత, గణేశుడితో సునీత