ఈ నేపథ్యంలో మిషనరీస్ ఆఫ్ చారిటీ అధికార ప్రతినిధి సునీత కుమార్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ, దీని గురించి తమకు ఎవరూ ఏమీ చెప్పలేదని స్పష్టం చేశారు. దీని గురించి తనకు అసలు ఏమీ తెలియదని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం తమకు ఏమీ చెప్పలేదని, బ్యాంకు లావాదేవీలు సజావుగానే జరుగుతున్నాయని ఆమె చెప్పారు. అంతా సవ్యంగానే ఉందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, ఎంవోసీకి చెందిన బ్యాంకు ఖాతాలేవీ తాము స్తంభింపజేయలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అయితే తమ ఖాతాలను స్తంభింపజేయాలని కోరుతూ ఆ గ్రూపు నుంచే అభ్యర్థన అందినట్లుగా ఎస్బీఐ వెల్లడించిందని వివరించింది.
అర్హతా ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎ్ఫసీఆర్ఏ) రిజిస్ర్టేషన్ పునరుద్ధరణ కోసం ఎంవోసీ చేసుకున్న దరఖాస్తును ఈ నెల 25న తిరస్కరించినట్లు తెలిపింది.
మంత్రిత్వ శాఖ ప్రకారం, ఎఫ్ సి ఆర్ ఎ 2010, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ రూల్స్ (ఎఫ్ సి ఆర్ ఆర్) 2011 ప్రకారం అర్హత షరతులను పాటించనందుకు ఎఫ్ సి ఆర్ ఎ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం ఆ సంస్థ చేసిన దరఖాస్తు డిసెంబర్ 25న తిరస్కరించారు. ఈ తిరస్కరణను సమీక్షించమని ఆ సంస్థ నుండి తిరిగి ఎటువంటి అభ్యర్ధన గాని,దరఖాస్తు గాని రాలేదని కూడా వివరణ ఇచ్చారు.
ఆ సంస్థ ఎఫ్ సి ఆర్ ఎ నమోదు అక్టోబర్ 31 వరకు చెల్లుబాటులో ఉండగా, పునరుద్ధరణ దరఖాస్తు పెండింగ్ లో ఉన్న ఇతర సంస్థలతో పాటుగా చెల్లుబాటును డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
More Stories
ఢిల్లీ పోలీసులను 4 వారల గడువు కోరిన రేవంత్ రెడ్డి
ఏప్రిల్లో గరిష్ట స్థాయికి చేరిన జీఎస్టీ వసూళ్లు
ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు