పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎదురవుతున్న ఎదురు గాలులు ఎదుర్కోవడం కోసం సంస్థాగతంగా పార్టీని మరింతగా పటిష్ట పరచడం కోసం బిజెపి కేంద్ర నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా రాష్ట్ర నాయకత్వంలో మరింతమంది యువకులకు చోటు కల్పించింది.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా కొత్తగా చేరిన వారిలో జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన ఫ్యాషన్ డిజైనర్ అగ్నిమిత్ర పాల్, జర్నలిస్టుగా మారిన రాజకీయవేత్త, మాజీ ఎబివిపి నాయకుడు జగన్నాథ్ చటోపాధ్యాయ ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా పనిచేసిన పురూలియా ఎంపీ జ్యోతిప్రియో మహతో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
ఇప్పుడు ఉత్తరాఖండ్లో పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న లాకెట్ ఛటర్జీకి రెండవసారి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంఘటన) బి ఎల్ సంతోష్ చేపట్టిన ఈ మార్పులతో రాష్ట్ర బిజెపి మరింత క్రియాశీలంగా పనిచేసేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు స్పష్టమయింది.
గత ఐదు నెలలుగా టిఎంసికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు సువెందు అధికారకు మరింత మద్దతు ఇచ్చే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. రెం డు రోజుల పర్యటన నిమిత్తం నడ్డా జనవరి 2న కోల్కతాకు రానున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారుఎక్కువగా ఉన్న ఈ కమిటీ రెండేళ్లలో జరగనున్న గ్రామీణ సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటైన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
More Stories
కాంగ్రెస్ వస్తే రామ మందిరానికి బాబ్రీ తాళం.. అందుకే 400 సీట్లు
విపక్షాలకు పాకిస్థాన్పై ప్రేమ? భారత సైన్యంపై ద్వేషం!
నేడు 92 స్థానాల్లో మూడో దశ ఎన్నికల పోలింగ్