వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఓ దివ్యాంగురాలి పాదాలకు మొక్కి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు.
కాశీలో మోదీ పర్యటిస్తున్న సమయంలో దివ్యాంగురాలైన శిఖా రాస్తోగి.. ఆయనను కలిసేందుకు ముందుకు వచ్చింది. ప్రధాని మోదీ ఆశీర్వాదం తీసుకునేందుకు ఆమె ప్రయత్నించగా, మోదీనే ఆమె పాదాలకు మొక్కారు. ఆమె యోగ క్షేమాలను మోదీ అడిగి తెలుసుకున్నారు.
అక్కడే ఉన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా శిఖాకు నమస్కరించి అభినందనలు తెలిపారు. ఈ ఫోటోను బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ తన ట్విట్టర్లో షేర్ చేసి, ఇది మహిళా శక్తికి గౌరవం అని ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విదేశాల నుంచి ఎరువులను దిగుమతి చేసుకోవలసి వస్తోందని, దీనివల్ల సాగు ఖర్చులు పెరుగుతున్నాయని, అందువల్ల ప్రకృతి సహజ సాగు విధానాలపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. సాగును రసాయన ప్రయోగశాల నుంచి బయటకు తేవాలని, ప్రకృతికిగల సొంత ప్రయోగశాలకు అనుసంధానం చేయాలని పిలుపునిచ్చారు. ఎరువులకు ఎలాంటి శక్తి ఉందో, దానిని ప్రకృతి నుంచి కూడా పొందవచ్చునని చెప్పారు. మనం దానిని తెలుసుకోవాలని చెప్పారు.
గత కొన్ని సంవత్సరాల్లో రైతులు ప్రకృతి సహజ సాగు విధానాలను అవలంబించడం వల్ల వ్యవసాయోత్పత్తులు ఏ విధంగా పెరిగాయో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ చెప్పారని మోదీ తెలిపారు. ప్రకృతి వ్యవసాయానికి ఆధారం సైన్సేనని చెప్పారు. ప్రపంచం సాంకేతికంగా ప్రగతి సాధించినప్పటికీ, ఇది తన మూలాలకు కూడా అనుసంధానమైందన్నారు. దీనిని సాగు రంగంలో కూడా అమలు చేయాలని పిలుపునిచ్చారు.
విత్తనం నుంచి నేల వరకు ప్రతిదాన్నీ సహజమైన రీతిలో చూడవచ్చునని తెలిపారు. ప్రకృతి సహజమైన సాగు విధానంలో ఎరువులు, పురుగు మందుల కోసం ఖర్చు చేయవలసిన అవసరం ఉండదని చెప్పారు. ఈ విధానంలో సాగునీటి అవసరం కూడా తగ్గుతుందన్నారు. వరదలు, కరువుకాటకాలు వంటి విపత్తులను కూడా ఎదుర్కొనే సత్తా లభిస్తుందని చెప్పారు. భారతీయ రైతులు స్వయం సమృద్ధమయ్యేందుకు ఈ విధానం దోహదపడుతుందని వివరించారు.
అంతకుముందు గవర్నర్ ఆచార్య దేవవ్రత్ మాట్లాడుతూ, వానపాములు, పశువుల పేడ, బెల్లం వంటి సహజ వనరులు ఏ విధంగా భూసారాన్ని పెంచగలవో వివరించారు. భూమిలో పోషక విలువలు పెరగడం వల్ల వ్యవసాయోత్పత్తులు పెరుగుతాయని తెలిపారు.
More Stories
ముగిసిన ఇదో విడత ప్రచారం … రేపే పోలింగ్
ఆరు నెలల్లో భారత్ లో భాగం కానున్న ఆక్రమిత కాశ్మీర్
కేంద్రంలో పదేళ్లుగా దమ్మున్న ప్రభుత్వం