ఏపీ హైకోర్టును ఉద్దేశించి జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరో యమూర్హ్టి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది జుడీషియల్ సెలెబ్రిటీలు లైమ్లైట్లో ఉండేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రధాన న్యాయమూర్తి విచారం వ్యక్తం చేసారు. అలాంటి లైట్స్ని ఆపేస్తామని పేర్కొ న్నారు.
తామూ మనుషులమేనని కొన్ని తప్పులు జరుగుతుంటాయని వ్యాఖ్యానించారు. మానవ హక్కుల రోజున ఆ అంశాలు ప్రస్తావించడానికి వచ్చిన ఆయన దాని గురించి మాట్లాడితే బాగుండేదని హితవు చెప్పారు. తాము పరిధి దాటి మాట్లాడామనడం సరికాదని ఏపీ సీజే స్పష్టం చేశారు.
కాగా, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ కూడా తీవ్రంగా స్పందించారు. ఏపీ హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరిస్తోందని, ప్రభుత్వం శత్రువులు, ప్రత్యర్థులతో కాదు న్యాయవ్యవస్థతో యుద్ధం చేస్తోందని జస్టిస్ చంద్రు వ్యాఖ్యానించారు. పైగా, అమరావతి భూస్కామ్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే హైకోర్టు స్టే ఇచ్చిందని, కోర్టులు న్యాయం చేయాల్సిందిపోయి ఏదో చేయడానికి ప్రయత్నిస్తోందని జస్టిస్ చంద్రు ఆరోపణలు చేశారు.
ఈ ఆరోపణలను జట్టు దేశానంద్ ఖండించారు. ఎంతో మంది ప్రాథమిక హక్కులను కాపాడుతున్నామని, జస్టిస్ చంద్రు ఆరోపణలు నిరాధారమైనవని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం హైకోర్టును ఎలా నిందిస్తారని ప్రశ్నించారు.
‘‘ఒక డాక్టర్ని పోలీసులు రోడ్పై విచక్షణారహితంగా కొట్టారు. హక్కుల గురించి పోరాడాలంటే విశాఖకు వెళ్ళండి. మంచి డైరెక్టర్తో సినిమా తీయించండి. దేశంలోని ఇతర హైకోర్టులతో పోలిస్తే జడ్జి నుంచి కక్షిదారుల వరకు ఏపీ హైకోర్టులో కనీస సౌకర్యాలు లేవు. కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తుంటే సీబీఐ విచారణకు ఆదేశించడం తప్పా?.’’ అని జస్టిస్ బట్టు దేవానంద్ ప్రశ్నించారు.
More Stories
తెలుగు భాషను బతికించుకోవాలి
టీడీపీ తుది జాబితా విడుదల
సరుకు రవాణాలో విశాఖ పోర్ట్ రికార్డు