ఆర్బీఐ రిటెయిల్ డైరెక్ట్ స్కీమ్, అదేవిధంగా ఐపీఓ ఆఫరింగ్ అప్లికేషన్లకు యూపీఐ చెల్లింపుల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతారు. ఈ స్కీమ్ ద్వారా వ్యక్తులు ఆర్బీఐ వద్ద గిల్ట్ సెక్యూరిటీస్ అకౌంట్ను తెరచి, ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టవచ్చు.
వాలెట్లు, కార్డులు, యూపీఐ ద్వారా చెల్లింపుల విధానంలో వసూలు చేసే ఛార్జీలపై డిస్కషన్ పేపర్ను విడుదల చేయనున్నట్లు శక్తికాంత దాస్ చెప్పారు.
కాగా, దేశంలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సిబిడిసి)ని అందుబాటులోకి తెస్తే ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మోసాలు ప్రధాన సవాళ్లుగా నిలువనున్నాయని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. సిబిడిటిల్లో హోల్సేట్, రిటైల్ లాంటి రెండు రకాలు ఉన్నాయని డిప్యూటీ గవర్నర్ టి శంకర్ తెలిపారు.
వీటిపై చాలా కసరత్తు జరుగుతుందని చెబుతూ దీనిపై పూర్తిగా స్పష్టత రావడానికి మరింత సమయం పడుతుందని చెప్పారు. ఈ రెండింటిలో ఏది ముందు పూర్తి అయినా దానిపై పైలెట్ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. వర్చూవల్ కరెన్సీ అనుమతి సాధ్యాసాధ్యాల పాలసీపై ఆర్బిఐ చాలా జాగ్రత్తగా వ్యవహారిస్తుందని దాస్ తెలిపారు. వర్చూవల్ కరెన్సీ చుట్టు అనేక భద్రత రిస్కులు ఉన్నాయని శంకర్ తెలిపారు.
More Stories
రైల్వే ప్రయాణికులకు రూ.20కే భోజనం
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
కవిత బెయిల్ పిటిషన్పై మే 2న తీర్పు