నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా అధికారికంగా జరపడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్ అంబేద్కర్ ప్రాధాన్యతను తగ్గించే విధంగా వ్యవహరించిన తీరును ప్రజలు తెలియచెప్పడం పట్ల బీజేపీ నాయకులు ఎటువంటి అవకాశాలను వదులుకోవడం లేదు.
తాజాగా, మొదటి పార్లమెంట్ ఎన్నికల్లో డాక్టర్ అంబేద్కర్ను ఓడించిన నారాయణ్ సదోబా కజ్రోల్కర్కు కాంగ్రెస్ పద్మభూషణ్ అవార్డును ఇచ్చిందని బిజెపిగుర్తు చేసింది. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సి.టి. రవి బెంగుళూరులో ఈ విషయం గుర్తు చేశారు.
జాతీయ, రాష్ట్ర స్థాయి ఎస్సీ మోర్చా సభ్యుల సమావేశంలో ప్రసంగించిన రవి డాక్టర్ అంబేద్కర్ తొలి భారతరత్న అవార్డుకు అర్హుడని, కానీ ఆయన విషయంలో కాంగ్రెస్ న్యాయం చేయలేదని విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అంబేద్కర్తో అనుబంధం గల ఐదు ప్రదేశాలను “పంచధాం” (తీర్థయాత్ర కేంద్రాలు)గా ప్రకటించిందని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
“మోదీ ప్రభుత్వం మధ్యప్రదేశ్లోని బాబాసాహెబ్ జన్మస్థలం మహువాను అభివృద్ధి చేసింది. ఆయన నివాసం ఉన్న లండన్ ఇంటిని కొనుగోలు చేసి స్మారక చిహ్నంగా మార్చారు. ఆయన రాజ్యాంగాన్ని రూపొందించిన అలీపూర్ రోడ్లోని అతని ఢిల్లీ నివాసం ఇప్పుడు స్మారక చిహ్నంగా ఉంది. నాగ్పూర్, అతని కర్మభూమి, ముంబైలో అతని అంత్యక్రియలు జరిగిన ప్రదేశాలను కూడా అభివృద్ధి చేసింది” అని వివరించారు.
‘
నేతాజీ అయినా, సర్దార్ పటేల్ అయినా, అంబేద్కర్ అయినా కాంగ్రెస్ అన్యాయం చేసిన నాయకులందరికీ న్యాయం చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని రవి చెప్పారు. మోదీ ప్రభుత్వం అందరికీ సమానత్వాన్ని విశ్వసిస్తోందని తెలిపారు. బిజెపికి దళితులు ఓటు బ్యాంకులు కాదని, దేశ అభివృద్ధి, పరిపాలనలో వాటాదారులని రవి స్పష్టం చేశారు.
సిద్ధరామయ్య వంటి కాంగ్రెస్ నేతలు దళిత వ్యతిరేకులని, రాజకీయాలలో ఆ వర్గాన్ని గౌరవించరని తీవ్రంగా ఆరోపించారు. మోదీ చేపట్టిన జన్ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్, స్టార్టప్ ఇండియా, ముద్ర వంటి పథకాలు డాక్టర్ అంబేద్కర్ పేదలకు సాధికారత కల్పించాలనే ఆలోచనతో ముడిపడి ఉన్నాయని చెప్పారు.
ఒక వ్యక్తి నాయకుడిగా ఎదిగేందుకు అతని సామర్థ్యాన్ని పెంపొందించాలని బీజేపీ విశ్వసిస్తోందని తెలిపారు. రా జకీయ అధికారం వారసత్వంగా రాకూడదు. ప్రజల మధ్య సమానంగా పంచబడాలి. అయితే దురదృష్టవశాత్తు, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ దేశంలో వంశపారంపర్య రాజకీయాలను ప్రచారం చేసిందని రవి ధ్వజమెత్తారు.
రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు చలవాడి నారాయణస్వామి కూడా దళితులను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. దళితులను ఓటు బ్యాంకులుగా, బందిపోటు కూలీలుగా భావించిన కాంగ్రెస్, బీజేపీని దళిత వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక, అంబేద్కర్ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిందని విస్మయం వ్యక్తం చేశారు. కానీ నేడు చదువుకున్న దళిత యువత ఈ మూర్ఖత్వాన్ని గ్రహించి సమాజం ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉందని చెప్పారు.
More Stories
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై ఈసీ వేటు
పదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ 10 లక్షల కోట్లు
యుద్ధాల వేదికగా మారిన అంతరిక్షం