
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమెకు పద్మశ్రీని ప్రదానం చేసిన రెండు రోజుల తర్వాత ఆమె నుండి ఇటువంటి ప్రకటన రావడంతో పలువురు ఆమె పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా పద్మశ్రీ పురస్కారాన్ని ఆమె తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
“… జాతీయవాదం అలాగే రైట్వింగ్ పెరిగింది… కానీ అది ఆకస్మిక మరణం ఎందుకు? మరి గాంధీ భగత్ సింగ్ని ఎందుకు చనిపోనిచ్చారు? నేతా బోస్ ఎందుకు చనిపోయారు? గాంధీజీ ఎందుకు ఎప్పుడు మద్దతు ఇవ్వలేదు? ? శ్వేతజాతీయుడు విభజన రేఖను ఎందుకు గీశాడు… ?స్వాతంత్య్ర వేడుకలకు బదులుగా భారతీయులు ఒకరినొకరు ఎందుకు చంపుకున్నారు?” అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.
“రైట్వింగ్ పోరాడటానికి, దానిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ భిక్షాటన గిన్నెలో ఎందుకు స్వాతంత్య్రం ఉంచబడింది? … దయచేసి ఎవరైనా నాకు అర్థం చేసుకోవడానికి సహాయం చేయగలరా?” అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు.
2019లో విడుదలైన తన చిత్రం “మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ” గురించి ప్రస్తావిస్తూ, ఇందులో తాను స్వాతంత్య్ర సమరయోధురాలు రాణి లక్ష్మీ బాయి పాత్రను పోషించానని గుర్తు చేశారు. ఈ సందర్భంగా తాను 1857 పోరాటంపై విస్తృతమైన పరిశోధన చేశానని ఆమె చెప్పారు.
‘సుభాష్ చంద్రబోస్, రాణి లక్ష్మీబాయి, వీర్ సావర్కర్ జీ వంటి మహానుభావుల త్యాగాలతో పాటు 1857 మొదటి సామూహిక స్వాతంత్య్ర పోరాటం గురించి తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రతిదీ చాలా స్పష్టంగా చెప్పానని ఆమె పేర్కొన్నారు.ఆ ఇంటర్వ్యూలో అమరవీరులను తాను అవమానించినట్టు చూపిస్తే పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తానని ఆమె సవాల్ చేశారు. తాను ‘రాణి లక్ష్మీబాయ్’ సినిమా చేశానని, 1857 మొదటి స్వాతంత్య్రం పోరాటంపై అధ్యయనం చేశానని, ఆ సమయంలో తనకు జాతీయవాదం పెరిగిందని ఆమె చెప్పారు.
More Stories
సద్గురు జగ్గీ వాసుదేవ్ కి వాటర్ ఛాంపియన్ అవార్డు
మంగోలియన్ బాలుడిని 3వ అత్యున్నత నేతగా పేర్కొన్న దలైలామా
నేటి నుండే విశాఖలో జీ–20 సదస్సు పట్టణీకరణపై దృష్టి