
ఎన్సిబి ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తండ్రి ధ్యాన్దేవ్ కచ్రూజీ వాంఖడే మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) నేత నవాబ్ మాలిక్పై పరువు నష్టం కేసు వేశారు. రూ.1.25 కోట్ల నష్టపరిహారం కోరుతూ బొంబాయి హైకోర్టులో కేసు దాఖలైంది. నవాబ్ మాలిక్ సూచనల మేరకు తమ కుటుంబం గురించి ప్రచురించడం, రాయడం చేస్తున్నారని, వాటిపై శాశ్వత నిషేధాన్ని కోరుకుంటున్నట్లు పిటిషన్లో కోరారు.
ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేని తన కుమార్తె, క్రిమినల్ లాయర్ అయిన యాస్మిన్ ప్రాక్టీస్ను నాశనం చేయడంతో పాటు మహారాష్ట్ర మంత్రి తన కుటుంబసభ్యుల కీర్తి ప్రతిష్టతలకు పూడ్చలేని నష్టం, హాని కలిగిస్తున్నారని, భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు.
బాలీవ్డ్ు స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్ నిందితుడిగా ఉన్న ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసు నుండి ఇటీవల ఎన్సిబి తొలగించి సమీర్ వాంఖడేపై నవాబ్ మాలిక్ వరుస ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్ ప్రమేయం ఉన్న కేసులో కూడా సమీర్ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఎన్సిబి అధికారిగా ఉద్యోగం పొందేందుకు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించారని ఆరోపించారు.
More Stories
అరుణాచల్ పై ‘జీ20’ సాక్షిగా చైనాకు భారత్ ఝలక్
సావర్కర్ పై రాహుల్ వాఖ్యలపట్ల ఉద్ధవ్ ఆగ్రహం!
రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కూతురు బాన్సురీ