
దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు దగ్గరపడుతున్న తరుణంలో బాణసంచా (ఫైర్క్రాకర్స్) విషయంలో పూర్తి నిషేధం లేదని, అయితే బేరియం సాల్ట్స్ ఉన్న క్రాకర్స్పై మాత్రమే నిషేధం ఉంటుందని సుప్రీం కోర్ట్ స్పష్టత ఉచ్చింది. తాము ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా.. వేడుకల మిషతో నిషేధించిన బాణసంచాను అనుమతించే అధికారం ఎవ్వరికీ లేదని కూడా జస్టిస్ ఎం.ఆర్.షా, సట్సి ఎ.ఎస్.బోపన్నతో కూడిన ధర్మాసనం ష్టం చేసింది.
వేడుకల పేరుతో ఇతరుల ఆరోగ్యాన్ని, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, పిల్లల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం కుదరదని, ఈ విషయమై భారత రాజ్యాంగంలోని 21వ అధికరణ వారికి రక్షణ కల్పిస్తోందని చెప్పింది. బాణసంచాపై పూర్తి నిషేధం లేనప్పటికీ, పౌరుల ఆరోగ్యంపై ప్రభావం చూపించే బేరియం సాల్ట్స్ ఉన్న క్రాకర్స్పై నిషేధం అమల్లో ఉంటుందని ధర్మాసనం తేల్చిచెప్పింది.
రాష్ట్రాలు, ఏజెన్సీలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటించాలని, అతిక్రమిస్తే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. బాణసంచా తయారీ, వినియోగం, నిషేధిత బాణసంచా అమ్మకాలకు సంబంధించి కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, స్థానిక కేబుల్ సర్వీసుల ద్వారా ప్రచారం చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
కాగా, పటాకులపై నిషేధం అనేది ఏ ఒక్క మతాన్ని ఉద్దేశించింది చేసింది కాదని, ప్రజలకున్న జీవించే హక్కును దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన తీర్పు అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వేడుకల పేరిట ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడాన్ని తాము అనుమతించబోమని తేల్చి చెప్పింది. పటాకులపై తాము ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా అమలు చేయాల్సిందేనని రాష్ట్రాలను, పటాకుల తయారీదారులను ఆదేశించింది.
నిషేధిత పటాకులు ఇంకా బహిరంగ మార్కెట్లో అందుబాటులో ఉండటంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఎందుకు శిక్షించకూడదో చెప్పాలంటూ ఆరు పటాకుల తయారీ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ‘వేడుకలు/సంబురాల సాకుతో పటాకుల తయారీదారులు ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని కోరింది.
“మేం ఏ ఒక్క మతానికి వ్యతిరేకం కాదు. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటానికే మేం ఇక్కడ ఉన్నామని ఒక బలమైన సందేశం ఇవ్వాలనుకొంటున్నాం. అందుకే పటాకులపై నిషేధం విధించాం. దీన్ని వక్రీకరిస్తున్నారు. అన్ని పటాకులపై నిషేధం విధించలేదు. గ్రీన్ క్రాకర్స్ అమ్మడానికి అనుమతి ఉంది” అని తెలిపింది.
More Stories
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాటలో 18 మంది మృతి
ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా మద్యం సేవించే మహిళలు
మహాకుంభ్లో 50 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు